Bumrah: జట్టులో మార్పులకు లాస్ట్ ఛాన్స్.. బుమ్రా ఫిట్‌నెస్‌పై నేడు క్లారిటీ

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ(ICC Champions Trophy)కి మరో 8 రోజులు మాత్రమే ఉంది. తుది జట్టులో మార్పులు చేర్పులు చేసుకోవడానికి గడుపు నేటితో (ఫిబ్రవరి 11)తో ముగియనుంది. ఈ నేపథ్యంలో టీమ్ఇండియా(Team India) స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా(Jasprit Bumrah) ఫిట్నెస్ విషయంలో ఇంకా BCCI ఎలాంటి ప్రకటన ఇవ్వలేదు. ఈ టోర్నమెంట్ కోసం ఎంపికైన 8 జట్లు ఫిబ్రవరి 19న ప్రారంభం కానున్న ICC టోర్నమెంట్ కోసం తమ తుది 15 మంది సభ్యుల జట్టును ప్రకటించాల్సి ఉంటుంది. అయితే ట్రోఫీని గెలుచుకునే ఫేవరెట్‌లలో ఒకటైన భారత జట్టుకు బుమ్రా విషయంలో కాస్త ఆందోళన చెందుతోంది. మరోవైపు భారత జట్టుకు బుమ్రా లేకపోతే బౌలింగ్ కాస్త వీక్ అవుతుందని అభిమానులు, క్రికెట్ మాజీలు అంటున్నారు.

బీజీటీ సిరీస్‌లో గాయపడి

ఈ నెల 19 నుంచి పాకిస్థాన్‌(Pakistan), దుబాయ్(Dubai) వేదిక‌ల‌లో జరగనున్న ఐసీసీ ఛాంపియ‌న్స్ ట్రోఫీలో జ‌స్ప్రీత్‌ బుమ్రా ఆడ‌తాడా? లేదా? అనే దానిపై ఉత్కంఠ నెల‌కొంది. జ‌ట్టులో మార్పుల‌కు ఐసీసీ ఇచ్చిన తుది గ‌డువు ఇవాళ్టితో ముగియ‌నుంది. ఈ నేప‌థ్యంలో BCCI నేడు బుమ్రా విష‌యంలో తుది నిర్ణ‌యం తీసుకునే అవ‌కాశం ఉంది. 2024-25 బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ (BGT)లో భారత్ తరపున అత్యుత్తమ ప్రదర్శన చేసిన‌ బుమ్రా.. సిరీస్ చివరి టెస్ట్ నుంచి గాయం కారణంగా దూర‌మ‌య్యాడు.

అదే జరిగితే రాణాకు ఛాన్స్

మరోవైపు ఫిబ్రవరి 12న అహ్మదాబాద్‌(Ahmadabad)లో ఇంగ్లండ్‌తో జరిగే 3వ వన్డేకు భారత జట్టులో బుమ్రాకు చోటు దక్కింది. అటు ఛాంపియన్స్ ట్రోఫీకి ఎంపిక చేసిన‌ తాత్కాలిక జట్టులో కూడా బుమ్రాకి చోటిచ్చారు. అయితే బెంగళూరులోని BCCI సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో బుమ్రా త‌న వెన్నునొప్పికి సంబంధించి స్కానింగ్ చేయించుకున్నాడు. ఈ స్కానింగ్ రిపోర్టు ఆధారంగా ఈరోజు బుమ్రా ఛాంపియ‌న్స్ ట్రోఫీ భ‌విత‌వ్యం తేల‌నుంది. ఒకవేళ బుమ్రా ఫిట్‌గా లేకుంటే అత‌ని స్థానంలో హర్షిత్ రాణా(Harshit Rana)ను తీసుకునే అవకాశం ఉంది.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *