తెలంగాణలో నేడు రాహుల్‌ గాంధీ ఆకస్మిక పర్యటన

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) ఇవాళ (ఫిబ్రవరి 11వ తేదీ) తెలంగాణలో ఆకస్మికంగా పర్యటించనున్నారు. ఈరోజు సాయంత్రం 5.30 గంటలకు ఆయన హనుమకొండలో పర్యటించనున్నట్లు కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. చెన్నై పర్యటన నేపథ్యంలో హనుమకొండలో ఆయన హెలికాప్టర్ ల్యాండింగ్ ఉంటుందని వెల్లడించాయి. సుప్రభ హోటల్‌లో రెండు గంటల పాటు హనుమకొండలో రాహుల్‌ రెస్ట్ తీసుకోనున్నట్లు పేర్కొన్నాయి.

విద్యార్థులతో రాహుల్ ట్రైన్ జర్నీ

విద్యార్థులతో ముఖాముఖిలో భాగంగా రాహుల్ గాంధీ రైల్లో ప్రయాణించనున్నారు. దిల్లీ నుంచి చెన్నైకి తమిళనాడు విద్యార్థులు రైల్లో వెళ్లనున్నారు. వారితో కలిసి రాహుల్ గాంధీ కూడా చెన్నై వెళ్తారు. అయితే విద్యార్థులతో కలిసి ప్రయాణం చేసేందుకు ఆయన వరంగల్‌ రైల్వేస్టేషన్‌లో రైలు ఎక్కనున్నారు. అనంతరం రైల్లో విద్యార్థులతో కలిసి ముఖాముఖిలో పాల్గొననున్నారు.

Related Posts

సొంతగడ్డపై సన్‘రైజర్స్’.. రాజస్థాన్‌పై 44 రన్స్‌ తేడాతో గ్రాండ్ విక్టరీ

ఐపీఎల్ రెండో మ్యాచ్‌లో సొంతగడ్డపై సన్‌రైజర్స్ హైదరాబాద్(SRH) అదరగొట్టింది. ఉప్పల్ వేదికగా రాజస్థాన్ రాయల్స్‌(RR)తో జరిగిన మ్యాచులో 44 పరుగుల తేడాతో గ్రాండ్ విజయం సాధించింది. భారీ స్కోర్లు నమోదైన ఈ మ్యాచులో ఇరు జట్ల బ్యాటర్లు ఫోర్లు, సిక్సర్లతో చెలరేగి…

Sikindar: ‘సికిందర్’ ట్రైలర్ రిలీజ్.. వింటేజ్ లుక్‌లో సల్మాన్‌భాయ్

బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్(Salman Khan), ప్రముఖ డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్(A.R. Murugadoss) కాంబోలో తెరకెక్కిన మూవీ ‘సికిందర్(Sikindar)’. ఈ మూవీలో సల్మాన్‌కు జోడీగా సక్సెస్‌ఫుల్ హీరోయిన్, నేషనల్ క్రష్ రష్మిక మందన్న(Rashmika Mandanna) నటిస్తోంది. సత్యరాజ్, కాజల్ అగర్వాల్(Kajal Agarwal)…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *