సీఎం కేసీఆర్​ సమక్షంలో సింగిరెడ్డి బీఆర్​ఎస్ గూటికి

మన ఈనాడు: 

ఉప్పల్​ కాంగ్రెస్​ పార్టీ మరో భారీ షాక్​ తగిలింది. సింగిరెడ్డి దంపతులు బీఆర్​ఎస్​ చేరికకు ముహార్తం కుదిరింది. సీఎం కేసీఆర్​ సమక్షంలో గులాబీ కండువా కప్పుకోనున్నారు.

కాంగ్రెస్​ పార్టీ కోసం కరుడు కట్టిన కార్యకర్తగా పనిచేశా..ఇంకా ఎంతోమంది పనిచేస్తున్నారు. కానీ రేవంత్​రెడ్డి టిక్కెట్లు అమ్మకుంటూ పార్టీని అమ్ముకునే కుట్ర చేస్తున్నారని ఉప్పల్​ టిక్కెట్​ ఆశించి భంగపడిన నేత సింగిరెడ్డి సోమశేఖర్​రెడ్డి టీపీసీసీ(TPCC) అధ్యక్షుడు రేవంత్​రెడ్డి సంచనల ఆరోపణలు చేశారు. తెలంగాణ భవన్​లో శుక్రవారం సీఎం కేసీఆర్​ సమక్షంలో బీఆర్​ఎస్​(BRS)లో చేరుతున్నట్లు సింగిరెడ్డి స్వయంగా ప్రకటించారు.

కాప్రా ప్రెస్​క్లబ్​లో గురువారం ఆయన సతీమణి ఏఎస్​రావునగర్​ కార్పొరేటర్​ సింగిరెడ్డి శిరీషారెడ్డితో కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. రెండోవిడత విడుదల తర్వాత రాష్ర్ట వ్యాప్తంగా రేవంత్​రెడ్డి బాధిత సంఘం(RBI) సంఘానికి అండగా నిలుస్తునాని బాధితులు పక్షాన పోరాటం చేస్తున్నానని చెప్పారు. బాధితులు అంతా కలసి కొడంగల్​లో రేవంత్​ ఓటమి కోసం కలిసి అడుగులు వేద్దామని పిలుపునిచ్చారు.

ఉప్పల్​ బీఆర్​ఎస్​ ఎమ్మెల్యే అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి కోసం తాను పనిచేస్తానని పేర్కొన్నారు. ఉప్పల్​ అభివృద్ధి చెందాలంటే బీఆర్​ఎస్​ ప్రభుత్వంతోనే బండారి లక్ష్మారెడ్డితోనే సాధ్యం అవుతుందన్నారు. తాను కార్యకర్తలు, ప్రజల కోసం తాను బీఆర్​ఎస్​ పార్టీలో సైతం అదే దూకుడుగా పనిచేస్తానని తెలిపారు.

Related Posts

Madhavi Latha Issue: JC ప్రభాకర్ రెడ్డికి షాక్.. కేసు నమోదు చేసిన పోలీసులు

తాడిపత్రి మాజీ MLA జేసీ ప్రభాకర్‌ రెడ్డి(JC Prabhakar Reddy)కి పోలీసులు షాకిచ్చారు. సినీ నటి మాధవీ లత(Madhavi Latha)పై అసభ్యకరమైన కామెంట్స్ చేసినందుకు ఆయనపై సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు(Cyberabad Cyber ​​Crime Police) పలు సెక్షన్ల కింద కేసు…

Delhi CM: ఈనెల 19 లేదా 20న ఢిల్లీ సీఎం అభ్యర్థి ప్రమాణం!

అందరూ ఉత్కంఠగా ఎదురుచూసిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల(Delhi Assembly Elections) ఫలితాలు ఈ నెల 8న వెలువడిన విషయం తెలిసిందే. మొత్తం 70 స్థానాల్లో జరిగిన ఎన్నికల్లో BJP రికార్డు స్థాయిలో 48 సీట్లు నెగ్గి ఘనవిజయం సాధించింది. అంత వరకూ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *