ఆపరేషన్​ థియేటర్​లో ‘అదుర్స్’.. సినిమా చూపించేశారు మావా

ManaEnadu:సర్జికల్ మాస్కు, గౌనులో యుద్ధానికి సిద్ధమైన డాక్టర్లు (Doctors).. వారి సూచనలు తు.చ. తప్పకుండా పాటించే మెడికల్ స్టాఫ్.. హైఅలర్ట్​లో ఆ గది.. బెడ్​పైన మెదడులో కణితితో ప్రాణాలతో పోరాడుతున్న ఓ రోగి.. గది బయట ఆయన ప్రాణం నిలవాలని వేయి దేవుళ్లకు మొక్కుకుంటున్న కుటుంబ సభ్యులు. ఇలాంటి పరిస్థితుల్లో రోగి (Patient) మానసిక స్థితి ఎలా ఉంటుంది? అతడికి వైద్యం చేసి కాపాడాలనుకుంటున్న వైద్యుల మనసులో ఏం మెదులుతుంది? ఎలాంటి డైవర్షన్ లేకుండా సైలెంట్​గా సర్జరీ చేసి ఆ రోగి ప్రాణాలు కాపాడాలి. కానీ ఆ ఆస్పత్రిలో ఏకంగా రోగికి సినిమా చూపించారు డాక్టర్లు. ఇంతకీ ఏం జరిగిందంటే?

మెలకువగా ఉండగానే సర్జరీ

కాకినాడలోని సర్వజన ఆసుపత్రి (జీజీహెచ్‌ (Kakinada GGH)) మంగళవారం మధ్యాహ్నం అనంతలక్ష్మి (55) అనే మహిళకు మెదడులోని కణితి తొలగింపు సర్జరీ చేశారు వైద్యులు. అయితే ఆమె మెలకువలో ఉండగానే (అవేక్‌ క్రేనియాటమీ) క్లిష్టమైన ఈ చికిత్సను చేసి వారు ప్రశంసలు అందుకున్నారు. మెదడు (Brain)లో ఎడమవైపు 3.3×2.7 సెం.మీ.ల పరిమాణంలో ఉన్న కణితిని అతి తక్కువ మోతాదులో మత్తు ఇచ్చి ఆమె మెలకువలో ఉండగానే శస్త్రచికిత్స ద్వారా తొలగించారు.

అదుర్స్ సినిమా చూపిస్తూ సర్జరీ

అయితే సర్జరీ చేసేటప్పుడు ఆ మహిళకు ట్యాబ్​లో ‘అదుర్స్‌ (Adhurs Movie)’ సినిమా చూపించారు. ఆమె సినిమాలో బ్రహ్మీ-ఎన్టీఆర్ (NTR) కామెడీ చూస్తూ హాయిగా రిలాక్స్ అవుతుండగా నొప్పి తెలియకుండా ఈ సర్జరీ చేశారు. సర్జరీ (Brain Surgery) తర్వాత ఆమె లేచి కూర్చున్నారు. బ్రేక్​ఫాస్ట్ కూడా చేశారు. జీజీహెచ్​లో ఇలాంటి సర్జరీ చేయడం ఇదే మొదటి సారి అని కాకినాడ జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ లావణ్యకుమారి, న్యూరోసర్జరీ విభాగం వైద్య నిపుణులు తెలిపారు. మరో అయిదు రోజుల్లో ఆమెను డిశ్ఛార్జి చేస్తామన్నారు. దాదాపు రెండున్నర గంటలపాటు న్యూరోసర్జరీ శస్త్రచికిత్స సీనియర్‌ వైద్యులు, మత్తు వైద్యుల పర్యవేక్షణలో ఈ శస్త్రచికిత్స జరిగింది.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *