పది పరీక్షలు.. విద్యార్థుల తల్లిదండ్రులకు ఖమ్మం కలెక్టర్ సూచనలివే

ఈనెల 21వ తేదీ నుంచి తెలంగాణలో పదో తరగతి పరీక్షలు (Telangana 10th Exams) ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్‌ 4వ తేదీ వరకు ఈ పరీక్షలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఖమ్మం జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ (Khammam Collector) మండల విద్యాధికారులు, ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, TSRIES/మోడల్ స్కూల్స్ ప్రిన్సిపల్స్, KGBV SOs, ఉపాధ్యాయులు, కాంప్లెక్స్ రిసోర్స్ పర్సన్స్ , MIS & CCOలు, విద్యార్థుల తల్లిదండ్రులకు ఓ లేఖ రాశారు. ఈ లేఖలో పరీక్షల సమయంలో విద్యార్థుల విషయంలో తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించారు.

తల్లిదండ్రులకు ఖమ్మం కలెక్టర్ సూచనలివే

  1. మీ పిల్లలతో ప్రేమగా ఉండండి. శాంతంగా మాట్లాడండి. వారు ఒత్తిడికి గురి కాకుండా స్నేహంగా మెలగండి.
  2. పరీక్షలు పూర్తయ్యే వరకు పిల్లలకు చదువు తప్ప ఇతర పనులేం చెప్పకండి.
  3. సమయాన్ని సద్వినియోగం చేసుకునేలా మార్గనిర్దేశం చేయండి.
  4. సెల్ ఫోన్ లు, టీవీలను దూరంగా ఉంచి, వారికి చదువుకునే వాతావరణాన్ని కల్పించండి.
  5. పిల్లలకు పాలు, పండ్లు వంటి ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించండి. బయట ఫుడ్ కు దూరంగా ఉంచండి.
  6. పిల్లలను నిరంతరం వెన్నుతట్టి ప్రోత్సహించండి. ఎట్టి పరిస్థితుల్లోను ఇతర పిల్లలతో పోల్చి నిరుత్సాపరచకండి.
  7. సరైన సమయానికి నిద్రపోయి తగినంత విశ్రాంతి తీసుకునే విధంగా చూడండి.
  8. పిల్లలను పరీక్షల పేరుతో భయానికి, ఒత్తిడికి గురి చేయకండి.
  9. ఉన్నత ఫలితాలను పొందటానికి నైపుణ్యం, క్షమత అత్యంత అవసరం. వాటిని ప్రోత్సహించండి.
  10. నేటి వరకు పిల్లలు పరీక్షలకు చక్కగా సిద్ధమయ్యారు. ఉపాధ్యాయులు మంచి ఫలితాలు సాధించేందుకు తగినంత కృషి చేశారు. కాబట్టి వారు ప్రశాంతంగా, ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాసేలా చేయడం ప్రస్తుతం మన బాధ్యత.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *