KL Rahul : RCBలోకి కేఎల్ రాహుల్.. హింట్ ఇచ్చిన స్టార్ బ్యాటర్

Mana Enadu : టీమిండియా స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ (KL Rahul) ఐపీఎల్​లో ప్రస్తుతం లఖ్​నవూ సూపర్ జెయింట్స్ (Lucknow Super Giants) టీమ్​కు కెప్టెన్​గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ స్టార్ క్రికెటర్ ఈ జట్టును వీడతాడని కొంతకాలంగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ వార్తలు కాస్త రాహుల్ వరకు చేరాయి. దీంతో రాహుల్ 2025 ఐపీఎల్​లో ఆర్సీబీ (RCB Team) జట్టుకు ఆడతాడా? అన్న విషయంపై తాజాగా హింట్ ఇచ్చాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.

KL Rahul RCB 2025

ఆర్సీబీ ఫ్యాన్ కేఎల్​ రాహుల్​తో మాట్లాడిన ఓ వీడియో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఈ వీడియోలో సదరు అభిమాని రాహుల్ ఆర్సీబీకి ఆడితే చూడాలని ఉందని తన మనసులోని మాటను చెప్పాడు. ‘నేను ఆర్సీబీ జట్టుకు డై హార్డ్ ఫ్యాన్​ని. చాలా కాలంగా ఆర్సీబీని ఫాలో అవుతున్నాను. మీరు కూడా గతంలో ఆర్సీబీ(Royal Challengers Bengaluru)కి ఆడారు. ప్రస్తుతం వైరల్​ అవుతున్న రూమర్స్​ గురించి నేను మాట్లాడను. కానీ, మీరు ఆర్సీబీకి మళ్లీ ఆడితే చూడాలనుకుంటున్నాను’ అని రాహుల్​తో అన్నాడు. దానికి రాహుల్ ‘లెట్స్ హోప్’ అని బదులిచ్చాడు.

ఇక ఈ వీడియో ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ముఖ్యంగా ఆర్సీబీ ఫ్యాన్స్ (RCB Fans) ఈ వీడియోను ట్రెండ్ చేస్తూ ‘రాహుల్​కు ఆర్సీబీ ఫ్రాంచైజీపై మంచి అభిప్రాయం ఉంది’, ‘రాహుల్ ప్లీజ్ ఆర్సీబీకి వచ్చెయ్’ అంటూ కామెంట్లు పెడుతున్నారు. 2013లో రాహుల్ ఆర్సీబీ జట్టుతోనే ఐపీఎల్​లో అరంగేట్రం చేసిన విషయం తెలిసిందే.

2014, 2015 సీజన్లలో సన్​రైజర్స్ హైదరాబాద్ (Sun Risers Hyderabad)​కు ప్రాతినిధ్యం వహించిన రాహుల్ 2016లో ఆర్సీబీకి తిరిగి వచ్చాడు. గాయం కారణంగా 2017 ఐపీఎల్​లో ఆడలేదు. 2018 ఆర్సీబీ అతడిని వదులుకోవడంతో రాహుల్ పంజాబ్ కింగ్స్ (Punjab Kings) జట్టుకు వెళ్లాడు. 2021 దాకా పంజాబ్​తో ఉన్న రాహుల్ ఆ తర్వాత లఖ్​నవూ ఫ్రాంచైజీకి కెప్టెన్ అయ్యాడు.

ఈ ఏడాది 2024 ఐపీఎల్​లో సన్​రైజర్స్​తో మ్యాచ్ ఓడిన తర్వాత లఖ్​నవూ ఓనర్ సంజీవ్ గోయెంకా (Sanjeev Goenka) కెప్టెన్ రాహుల్​పై అందరిముందే అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఆ వీడియో అప్పట్లో పెద్ద దుమారం రేపింది. అప్పటి నుంచి రాహుల్ జట్టు మారడతాడని వార్తలు వస్తున్నాయి. తాజాగా ఈ వైరల్ అవుతున్న వీడియోతో రాహుల్ టీమ్ మారడం పక్కా అని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *