మహా కుంభమేళాలో చివరి రాజ స్నానం ఎప్పుడు? ఎలా చేయాలి? 

144 ఏళ్లకోసారి వచ్చే మహాకుంభమేళా (Maha Kumbh Mela) ఉత్తర్ ప్రదేశ్ లోని ప్రయాగరాజ్​లో జరుగుతున్న విషయం తెలిసిందే. నెల రోజులుగా సాగుతున్న ఈ అతిపెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమం చివరి దశకు చేరుకుంది.మహా కుంభమేళాలో మొత్తం ఆరు రాజ స్నానాలు (అమృత స్నానం (Raja Snanam)) జరుగుతాయన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఐదు రాజ స్నానాలు (భోగి, మకర సంక్రాంతి, మౌని అమావాస్య, వసంత పంచమి, మాఘ పౌర్ణమి) రోజు పూర్తయ్యాయి. ఇక చివరి (ఆరవ) రాజస్నానం ఎప్పుడు జరుగనుంది? శాస్త్రోక్తంగా దీన్ని ఎలా ఆచరించాలో తెలుసుకుందాం.

రాజస్నానం ఎలా చేయాలంటే?

కుంభ మేళాలో చేసే రాజ స్నానాలలో చివరిది (ఆరో రాజస్నానం) మహాశివరాత్రి (Maha Shivaratri) రోజున జరగనుంది. ఫిబ్రవరి 26వ తేదీన రానున్న మహాశివరాత్రి రోజున ఈ అమృత స్నానం ఆచరించాల్సి ఉంటుంది. అదే రోజున మహాకుంభమేళా కూడా ముగియనుంది. మహా కుంభ మేళాలో రాజ స్నానం చేసే వారు ముందుగా గంగమ్మ తల్లికి నమస్కరించి నది ఒడ్డు నుంచి కొంత మట్టి సేకరించి నది లోపలికి ప్రవేశిస్తూ నీటిలో ఆ మట్టిని కలపాలి. ఆ తర్వాత భక్తి శ్రద్ధలతో ముక్కు మూసుకొని మూడు సార్లు నదిలో మునిగి.. దోసిలితో నీరు తీసుకొని తూర్పు తిరిగి సూర్యునికి అర్ధ్యం ఇవ్వాలి.

ఇదే ఆఖరి అవకాశం

అనంతరం నీటిలో నుంచి బయటకు వచ్చి నదిలోకి పసుపు కుంకుమ, పువ్వులు సమర్పించి.. అరటి దొన్నె లో దీపం ఉంచి నదిలో వదిలి నమస్కరించాలి. ఈ విధంగా శాస్త్రోక్తంగా నదీస్నానం (Amrit Snan) పూర్తి చేసిన తరువాత నది తీరంలో పితృదేవతలకు పిండ ప్రదానం చేయడం చేస్తే పితృదేవతలు సంతోషించి వంశాభివృద్ధి కలుగుతుందని భక్తుల విశ్వాసం. మహాకుంభమేళాలో స్నానం చేయడానికి ఇదే ఆఖరి అవకాశం కాబట్టి వీలైతే తప్పకుండా ప్రయాగరాజ్ వెళ్లి అమృత స్నానం చేద్దాం.  ఓం నమః శివాయ!

Related Posts

సొంతగడ్డపై సన్‘రైజర్స్’.. రాజస్థాన్‌పై 44 రన్స్‌ తేడాతో గ్రాండ్ విక్టరీ

ఐపీఎల్ రెండో మ్యాచ్‌లో సొంతగడ్డపై సన్‌రైజర్స్ హైదరాబాద్(SRH) అదరగొట్టింది. ఉప్పల్ వేదికగా రాజస్థాన్ రాయల్స్‌(RR)తో జరిగిన మ్యాచులో 44 పరుగుల తేడాతో గ్రాండ్ విజయం సాధించింది. భారీ స్కోర్లు నమోదైన ఈ మ్యాచులో ఇరు జట్ల బ్యాటర్లు ఫోర్లు, సిక్సర్లతో చెలరేగి…

Sikindar: ‘సికిందర్’ ట్రైలర్ రిలీజ్.. వింటేజ్ లుక్‌లో సల్మాన్‌భాయ్

బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్(Salman Khan), ప్రముఖ డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్(A.R. Murugadoss) కాంబోలో తెరకెక్కిన మూవీ ‘సికిందర్(Sikindar)’. ఈ మూవీలో సల్మాన్‌కు జోడీగా సక్సెస్‌ఫుల్ హీరోయిన్, నేషనల్ క్రష్ రష్మిక మందన్న(Rashmika Mandanna) నటిస్తోంది. సత్యరాజ్, కాజల్ అగర్వాల్(Kajal Agarwal)…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *