RED CHILLI: ఏపీలో ఘాటెక్కిస్తున్న ‘మిర్చి’.. మద్దతు ధరపై పొలిటికల్ వార్

ప్రస్తుతం ఏపీ(Andhra Pradesh)లో ఓవైపు భానుడు ప్రతాపం చూపిస్తుంటే.. మరోవైపు మిర్చి ఘాటు పొలిటికల్‌(Political)గా ఘాటెక్కిస్తోంది. మిర్చికి మద్దతు ధర(Price)పై అధికార, ప్రతిపక్షాలు ఎవరికి వారు ప్రసంగాలు చేస్తుండటంతో ఏపీలోని గుంటూరులో మిర్చి బోర్డు(Mirchi Board) ఏర్పాటు మళ్లీ తెరమీదకు వచ్చింది. ఇందుకు కారణం లేకపోలేదు. గత సీజన్ వరకూ క్వింటా మిర్చి రేటు రూ.21000కు పైగా పలికింది. దీంతో అన్నదాతల మోముల్లో చిరునవ్వులు చిందాయి. అదే ఊపులో ఈసారి అంతకు రెట్టింపు సాగు చేపట్టారు. కానీ వారి ఆశలు అడియాశలయ్యాయి. క్వింటా మిర్చి ధర ఏకంగా రూ.11వేల నుంచి రూ.13వేలకు పడిపోయింది. దీంతో రైతన్నలు లబోదిబోమంటున్నారు. తాజాగా ఇదే విషయంపై ఏపీ డిప్యూటీ స్వీకర్(AP Deputy Speaker) రఘురామకృష్ణరాజు స్పందించారు.

Dasaripalem on the outskirts of Guntur to be new destination of chilli  market yard - The Hindu

ప్రత్యేక మిర్చి బోర్డు ఏర్పాటు ద్వారానే శాశ్వత పరిష్కారం

APలో మిర్చి తగ్గడం రాజకీయ చర్చకు దారితీసింది. మొన్న YCP అధినేత గుంటూరు మిర్చి యార్డు(Mirchi Yard)కు వచ్చి అన్నదాతలకు మద్దతుగా మాట్లాడారు. ఆ తర్వాతి రోజే ఏపీ సీఎం చంద్రబాబు(CM Chandrababu) కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌(Shivraj Singh Chauhan)తో మిర్చికి మద్దతు ధరపై చర్చించారు. దీనిపై సానుకూలంగా స్పందించిన ఆయన సంబంధిత వర్గాలతో సమావేశం నిర్వహించాలని భావించారు. ఇదిలా ఉండగా.. డిమాండ్ తగ్గడంతో కొనుగోళ్లు, మద్దతు ధర తగ్గినట్లు వ్యాపారులు చెబుతున్నారు. ప్రత్యేక మిర్చి బోర్డు ఏర్పాటు ద్వారా మిర్చి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు(RRR) తెలిపారు.

జగన్‌ అనుకున్నది జరగనివ్వను - మూడు వారాలు ఆగితే నేనేంటో చూపిస్తా:  రఘురామరాజు - RAGHU RAMA RAJU CHALLENGE

సీఎం చంద్రబాబు చొరవ చూపాలి

పశ్చిమ గోదావరి జిల్లాలో ఆయన మాట్లాడుతూ.. మిర్చి రైతుల సమస్యలు పరిష్కారించాలని అన్నారు. కేంద్రం తెలంగాణలో పసుపు బోర్డు మాదిరిగానే ఏపీలో మిర్చి బోర్డు ఏర్పాటు చేయాలన్నారు. కేంద్రం, రాష్ట్రంలో ఎన్డీయే ప్రభుత్వమే అధికారంలో ఉన్నందున సీఎం చంద్రబాబు(CM Chandrababu) ఈ విషయమై ప్రత్యేక చొరవ చూపాలని కోరారు. అయితే ఇటీవల మాజీ సీఎం జగన్‌కు గుంటూరు మిర్చి యార్డుకు వెళ్లొద్దని పోలీసులు చెప్పినా వెళ్లి ఎన్నికల కోడ్(Election Code)ను ఉల్లంఘించారని పేర్కొన్నారు.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *