హైకోర్టును ఆశ్రయించిన బీజేపీ ఎంపీ ఈటల

మల్కాజిగిరి ఎంపీ (BJP) ఈటల రాజేందర్‌ (Eatala Rajender) హైకోర్టు (Telangana High Court)ను ఆశ్రయించారు. పోచారం పీఎస్‌లో నమోదైన ఎఫ్‌ఐఆర్‌ను కొట్టివేయాలని కోరుతూ ఆయన ఉన్నత న్యాయస్థానంలో పిటిషన్‌ దాఖలు చేశారు. ఇటీవల ఏకశిలానగర్‌లో స్థిరాస్తి వ్యాపారిపై చేయి చేసుకున్నారని వాచ్‌మెన్‌ ఫిర్యాదు చేయగా.. ఈటలపై పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. దీంతో ఈటల హైకోర్టును ఆశ్రయించారు.

ఇదీ జరిగింది..

ఇటీవల మేడ్చల్ జిల్లా పోచారం మున్సిపాలిటీలోని ఏకశిలానగర్‌లో ఎంపీ ఈటల పర్యటించారు.  తమ భూములు లాక్కుంటున్నారన్న బాధితుల ఫిర్యాదుతో స్థిరాస్తి దళారిపై ఆగ్రహించిన ఎంపీ.. ఈ క్రమంలో అతనిపై చేయిచేసుకున్నారు. కొందరు దొంగ పత్రాలు సృష్టించి పేదల భూములు లాక్కుంటున్నారని ఈటల ఆరోపించారు. బ్రోకర్లకు సహకరించే అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దళారులతో పోలీసులు, అధికారులు కుమ్మక్కవుతున్నారన్న ఆయన.. పేదలు కొనుక్కున్న స్థలాలకు బీజేపీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

Telangana Assembly: నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సెషన్స్.. దానిపైనే ప్రధాన చర్చ!

తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు(Telangana Assembly special sessions) నేటి (ఆగస్టు 30) నుంచి మూడు రోజుల పాటు జరగనున్నాయి. ఈ మేరకు ఉదయం 10:30 గంటలకు ప్రారంభం కానున్నాయి. తొలిరోజు ఉభయసభల్లో తొలుత ఇటీవల మరణించిన MLAలు, మాజీ సభ్యులకు…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *