BIG BREAKING: నందమూరి బాలకృష్ణకు ‘పద్మభూషణ్’ అవార్డు

గణతంత్ర దినోత్సవాలను పురస్కరించుకొని కేంద్ర ప్రభుత్వం పద్మ పురస్కారాల(Padma Awards)ను ప్రకటించింది. వివిధ రంగాలలో విశేష సేవలు, ప్రతిభ కనబర్చిన 139 మందికి కేంద్రం పద్మ అవార్డులను అందజేయనుంది. ఈ సందర్భంగా సినీ నటుడు నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna)కు కళల విభాగంలో పద్మ భూషణ్(Padma Bhushan) అవార్డు దక్కింది. అలాగే దువ్వూరి నాగేశ్వర్ రెడ్డికి పద్మ విభూషణ్ పురస్కారం లభించింది. కాగా బాలయ్యకు పద్మభూషణ్ అవార్డు రావడంతో తెలుగు ప్రజలు, నందమూరి అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సినీరంగంలో బాలకృష్ణతోపాటు కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్, అలాగే సీనియర్ హీరోయిన్ శోభనకు సైతం పద్మ భూషణ్ అవార్డులు ప్రకటించింది. కేంద్రం మొత్తంగా 139 మందికి ‘పద్మ’ అవార్డులు ప్రకటించారు. వారిలో ఏడుగురికి పద్మ విభూషణ్‌, 19 మందికి పద్మభూషణ్‌, 113 మందికి పద్మశ్రీ పురస్కారాలు ప్రకటించారు.

సంక్రాంతి పండగ సందర్భంగా ‘డాకు మహారాజ్(Daaku Mahaaraj)’ సినిమాతో అడియన్స్ ముందుకు వచ్చారు బాలకృష్ణ. డైరెక్టర్ బాబీ దర్శకత్వం వహించిన ఈ మాస్ యాక్షన్ డ్రామా భారీ విజయాన్ని అందుకుంది. ఇందులో ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్లుగా నటించారు. మరోవైపు హిందూపురం ఎమ్మెల్యేగా ప్రజలకు సేవ చేస్తున్నారు బాలయ్య.

Related Posts

మళ్లీ భారత్‌లోకి టిక్‌టాక్? క్లారిటీ ఇచ్చిన కేంద్రం ప్రభుత్వం..

2020 గాల్వన్ లోయ ఘటన తర్వాత భారత్–చైనా మధ్య సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఆ సమయంలోనే భారత ప్రభుత్వం డేటా భద్రత, గోప్యతా సమస్యలను ప్రస్తావిస్తూ పలు చైనా యాప్‌లపై నిషేధం విధించింది. టిక్‌టాక్(TikTok), అలీ ఎక్స్‌ప్రెస్(ali Express), షీన్(Sheein) వంటి…

BIGG BOSS-S9: బుల్లితెర ప్రేక్షకులకు అదిరిపోయే న్యూస్.. వచ్చే నెల 7 బిగ్‌బాస్-9 షురూ

తెలుగు టెలివిజన్ రియాలిటీ షోలలో అత్యంత ప్రజాదరణ పొందిన ‘బిగ్ బాస్(Bigg Boss) తెలుగు’ సీజన్ 9(BB-9) సెప్టెంబర్ 7 నుంచి ఆరంభం కానుంది. స్టార్ మా(Star Maa), జియో హాట్‌స్టార్‌(Jio Hotstar)లో ప్రసారం కానున్న ఈ షోను అక్కినేని నాగార్జున(Nagarjuna…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *