శ్రీశైల మల్లన్న సన్నిధిలో నాగచైతన్య, శోభిత.. ఫొటోలు వైరల్

Mana Enadu : ప్రముఖ సినీ నటుడు అక్కినేని నాగార్జున (Nagarjuna) తనయుడు, టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని నాగచైతన్య (naga chaitanya), నటి శోభిత ధూళిపాళ (sobhita dhulipala ) వివాహం డిసెంబరు 4వ తేదీన జరిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా ఈ నూతన జంట అక్కినేని కుటుంబంతో కలిసి శ్రీశైలంలో సందర్శించారు. ఈ సందర్భంగా శ్రీశైలం మల్లికార్జున స్వామి, భ్రమరాంబ అమ్మవార్లను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. స్వామికి రుద్రాభిషేకం నిర్వహించారు.

శ్రీశైలం సన్నిధిలో కొత్త జంట

అనంతరం అర్చకులు నూతన దంపతులకు (Chaitu Sobhita) ఆశీర్వచనం అందజేశారు. మొదట ఈ కుటుంబానికి మహాద్వారం వద్ద ఆలయ అధికారులు, అర్చకులు స్వాగతం పలికారు. స్వామి దర్శనం అనంతరం తీర్థప్రసాదాలు అందజేశారు. వీరి శ్రీశైలం పర్యటనకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ సందర్భంగా నెటిజన్లు కొత్త జంటకు శుభాకాంక్షలు చెబుతున్నారు.

రింగు కోసం కొత్తజంట పోటీ

 మరోవైపు బుధవారం రాత్రి హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో జరిగిన చైతూ-శోభిత (naga chaitanya sobhita dhulipala wedding) వివాహానికి సంబంధించిన పలు వీడియోలు కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా ఈ జంట రింగు కోసం పోటీ పడిన వీడియో ఒకటి బాగా వైరల్ అవుతోంది. సాధారణంగా పెళ్లి వేడుకలో ఓ బిందెలో నీరు పోసి అందులో ఉంగరం వేసి వధూవరులను వెతకమని చెప్పే ఓ కార్యక్రమం ఉంటుంది. తాజాగా వీరి వివాహ వేడుకలో కూడా ఆ కార్యక్రమం నిర్వహించగా రింగు కోసం జరిగిన ఈ పోటీలో చైతూ గెలిచాడు. 

నా హృదయం ఉప్పొంగుతోంది

ఇక నాగచైతన్య- శోభిత పెళ్లి ఫొటోలను నాగార్జున తన ఎక్స్ ఖాతాలో పోస్ట్‌ చేసి ఓ హార్ట్ ఫెల్ట్ సందేశాన్ని రాసుకొచ్చాడు. ఈ సందర్భంగా ఆయన మీడియాకు, ఫ్యాన్స్‌కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ‘డియర్‌ ఫ్రెండ్స్‌, ఫ్యామిలీ, ఫ్యాన్స్‌.. మీ ప్రేమ, ఆశీస్సులు ఈ వేడుకను ప్రత్యేకం చేశాయి. ఈ అందమైన క్షణాల్లో మమ్మల్ని అర్థం చేసుకున్న మీడియాకు ధన్యవాదాలు. కృతజ్ఞతతో నా హృదయం ఉప్పొంగుతోంది’ అని నాగ్ తన పోస్టులో రాసుకొచ్చాడు. 

Related Posts

Allu Kanakaratnamma: అల్లు అర్జున్ ఇంట విషాదం.. అల్లు కనకరత్నమ్మ కన్నుమూత

టాలీవుడ్‌(Tollywood)లో ప్రముఖ నిర్మాత, గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్(Allu Aravind) ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆయన తల్లి, దివంగత హాస్య నటుడు అల్లు రామలింగయ్య భార్య అల్లు కనకరత్నమ్మ (Allu Kanakaratnamma, 94) శనివారం తెల్లవారుజామున 1:45 గంటలకు…

Megastar Chiranjeevi: చిరూని కలిసి మహిళా వీరాభిమాని.. రాఖీ కట్టి తీవ్ర భావోద్వేగం 

కర్నూలు జిల్లా ఆదోనికి చెందిన మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) వీరాభిమాని రాజేశ్వరి(Rajeshwari), తన ఆరాధ్య నటుడిని కలిసేందుకు సైకిల్‌(Cycle)పై సుదీర్ఘ ప్రయాణం చేసి హైదరాబాద్(Hyderabad) చేరుకున్నారు. ఈ సంఘటన చిరంజీవిని ఆశ్చర్యంలో ముంచెత్తడమే కాక, అభిమానుల హృదయాలను కూడా కదిలించింది. రాజేశ్వరి…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *