గుడ్ న్యూస్.. ఆరోజే కొత్త రేషన్ కార్డుల పంపిణీ!

రేషన్ కార్డుల (Ration Cards) కోసం ఎదురు చూస్తున్న వారికి రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఒకే రోజు ఏకంగా లక్ష కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేయాలని నిర్ణయించింది. మార్చి 1వ తేదీన ఈ కార్డులను పంపిణీ చేయనుంది. దీంతో పదేళ్ల తర్వాత పేదల కల నెరవేరబోతోంది. ఎమ్మెల్సీ ఎన్నికల (MLC Elections 2025) నేపథ్యంలో పలు జిల్లాల్లో ఎలక్షన్‌ కోడ్‌ అమల్లో ఉంది.

ముందుగా ఆ జిల్లాల్లో పంపిణీ

ఈ నేపథ్యంలో ఆ జిల్లాలు మినహా హైదరాబాద్‌ (Hyderabad), ఉమ్మడి రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల్లో కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. మిగిలిన జిల్లాల్లో మార్చి 8వ తేదీ తర్వాత వాటిని పంపిణీ చేయనుంది. జనవరి 26వ తేదీన ఎంపిక చేసిన గ్రామాల్లో 16,900 కుటుంబాలకు కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేసిన విషయం తెలిసిందే.

మరో 6 లక్షల కొత్త కార్డులు

ఇక తెలంగాణలో ప్రస్తుతం 90 లక్షల రేషన్‌ కార్డులకు 2.81 కోట్ల మంది లబ్ధిదారులున్నారు. ఇక తాజాగా మరో 6 లక్షల వరకు కొత్త కార్డులు జారీ అయ్యే అవకాశం ఉంది. కొత్త రేషన్‌ కార్డుల కోసం దరఖాస్తు ప్రక్రియ ఇంకా కొనసాగుతోంది. అర్హులు రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకోవచ్చని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *