‘నాన్న.. నన్ను ఎప్పుడూ వెంటాడే ఎమోషన్’ అంటూ.. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ (NTR), డైరెక్టర్ సుకుమార్ కాంబోలో నాన్నకు ప్రేమతో (Nannaku Prematho) అనే సినిమా వచ్చిన విషయం తెలిసిందే. ఈ చిత్రం అప్పట్లో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. తారక్, సుక్కు కాంబో సూపర్ హిట్ అయింది. ఈ కాంబోలో మరో మూవీ వస్తే బాగుంటుందని ఇప్పటికీ ప్రేక్షకులు కోరుకుంటున్నారు. వీరికి సినిమా పరంగానే కాదు.. వ్యక్తిగతంగానూ మంచి బాండింగ్ ఉంది. అయితే తాజాగా సుకుమార్, ఎన్టీఆర్ లేటెస్ట్ ఫొటో ఒకటి నెట్టింట సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది.

తారక్, సుక్కు.. ఓ క్యూట్ ఫొటో
తాజాగా ఎన్టీఆర్, డైరెక్టర్ సుకుమార్ (Sukumar) ఫొటో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఈ ఇద్దరు బ్లాక్ డ్రెస్సులో ఓ సోఫాపై కూర్చొని హగ్ చేసుకున్న ఫొటో నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ ఫొటో చూస్తుంటే వీళ్ల మధ్య ఉన్న ఆత్మీయానుబంధం ఏంటో ఇట్టే అర్థమైపోతోంది. అయితే ఈ ఫొటోను సుకుమార్ సతీమణి బబితా (Babitha Sukumar) ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేశారు. దానికి తారక్ కు ప్రేమతో అనే క్యాప్షన్ జత చేసి ఎన్టీఆర్ ను ట్యాగ్ చేశారు. అయితే ఈ పోస్టుపై మ్యాన్ ఆఫ్ మాసెస్ స్వయంగా స్పందించారు.
నన్ను ఎప్పుడూ వెంటాడే ఎమోషన్
బబిత షేర్ చేసిన ఫొటోను స్క్రీన్ షాట్ తీసి తన ఇన్ స్టాలో షేర్ చేశారు తారక్ (Tarak Latest News). దానికి ఓ అదిరిపోయే క్యాప్షన్ ఇచ్చారు. నన్ను ఎప్పుడూ వెంటాడే ఎమోషన్ అని క్యాప్షన్ రాసుకొచ్చి కింద సుకుమార్ ను ట్యాగ్ చేశారు. ఈ ఇద్దరి కాంబోలో వచ్చిన నాన్నకు ప్రేమతో సినిమాలోని డైలాగ్ ను క్యాప్షన్ గా పెట్టడంతో ఇప్పుడు అందర్నీ ఆకర్షిస్తోంది. అయితే ఉన్నట్టుండి ఈ ఫొటో ఇప్పుడు వైరల్ కావడంతో ఈ కాంబోలో మరో సినిమా వస్తుందా అన్న డౌటు ప్రేక్షకుల్లో కలిగింది. ఇది నిజమైతే బాగుంటుందని తారక్ ఫ్యాన్స్ భావిస్తున్నారు.






