అగ్నిప్రమాదంలో గాయపడిన ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) కుమారుడు మార్క్ శంకర్(Mark Shanker) ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఈ విషయాన్ని మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) సోషల్ మీడియా(X) వేదికగా తెలియజేశారు. ‘మా బిడ్డ మార్క్ శంకర్ ఇంటికి వచ్చేశాడు. అయితే, ఇంకా కోలుకోవాల్సి ఉంది’ అని ఆయన పేర్కొన్నారు.
ఆంజనేయస్వామి దయ, కృపతో..
కాగా తమ కులదైవమైన ఆంజనేయస్వామి దయ, కృపతో మార్క్ శంకర్ త్వరలోనే పూర్తి ఆరోగ్యం(Healthy)తో మునుపటిలా ఉంటాడని చిరు ఆకాంక్షించారు. కాగా రేపు హనుమాన్ జయంతి(Hanuman Jayanthi) అని చిరంజీవి గుర్తు చేశారు. ఆ స్వామి తమ పసిబిడ్డను ఒక పెద్ద ప్రమాదం నుంచి, విషాదం నుంచి కాపాడి తమకు అండగా నిలిచారని ఆయన అన్నారు.
ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు
మార్క్ శంకర్ త్వరగా కోలుకోవాలని ప్రతి ఒక్కరూ తమ గ్రామాల్లో, తమ తమ ప్రాంతాల్లో ఆ బిడ్డ కోసం ప్రార్థనలు చేసి, ఆశీస్సులు అందజేస్తూ తమకు అండగా నిలుస్తున్నారని రాసుకొచ్చారు. వారందరికీ తన తరఫున, పవన్ కళ్యాణ్ తరఫున, తమ కుటుంబం తరఫున ధన్యవాదాలు(Thanks) తెలియజేస్తున్నానని మెగాస్టార్ పేర్కొన్నారు.
మా బిడ్డ మార్క్ శంకర్ ఇంటికొచ్చేసాడు. అయితే ఇంకా కోలుకోవాలి. మా కులదైవమైన ఆంజనేయ స్వామి దయతో, కృపతో త్వరలోనే పూర్తి ఆరోగ్యంతో, మళ్ళీ మామూలుగా ఎప్పటిలానే వుంటాడు.
రేపు హనుమత్ జయంతి, ఆ స్వామి ఓ పెద్ద ప్రమాదం నుంచి, ఓ విషాదం నుంచి ఆ పసి బిడ్డని కాపాడి మాకు అండగా… pic.twitter.com/nEcWQEj92v
— Chiranjeevi Konidela (@KChiruTweets) April 10, 2025






