
మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran) తెరకెక్కించిన లేటెస్ట్ సినిమా ‘ఎల్ 2: ఎంపురాన్’ (L2: Empuraan). లాలెట్టా మోహన్ లాల్ (Mohan Lal) ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా మార్చి 27వ తేదీన థియేటర్లలో విడుదలైంది. ఈ చిత్రం యాక్షన్ థ్రిల్లర్ ‘లూసిఫర్’ కొనసాగింపుగా వచ్చింది. పృథ్వీరాజ్ సుకుమారన్, మంజు వారియర్, టొవినో థామస్, అభిమన్యుసింగ్, ఇంద్రజీత్ సుకుమారన్ కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపించింది.
ఓటీటీలోకి ఎల్2 : ఎంపురాన్
ఇక ఈ చిత్రం థియేటర్లలో సూపర్ హిట్ గా నిలిచింది. ఇప్పుడు డిజిటల్ ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అయింది. ఎల్2 ఎంపురాన్ మూవీ ఓటీటీలో అలరించేందుకు రెడీగా ఉంది. ఈ నెల 24వ తేదీ నుంచి ‘జియో హాట్స్టార్’ (Jio Hotstar)లో ఈ చిత్రం స్ట్రీమింగ్ కానుంది. తెలుగు, మలయాళం, కన్నడ, తమిళ్ భాషల్లో ఈ సినిమా అందుబాటులోకి రానుంది. 2002లో గుజరాత్లో చోటుచేసుకున్న ఘటనల ఇతివృత్తంగా తెరకెక్కించిన సన్నివేశాలు రాజకీయంగా చర్చనీయాంశ కావడంతో రీ సెన్సార్ అనంతరం కొన్ని మార్పులు చేశారు.
మాలీవుడ్ లో ఎల్2 : ఎంపురాన్ రికార్డ్
ఇక హిట్ మూవీ ‘లూసిఫర్ (Lucifer Sequel)’కు సీక్వెల్గా తెరకెక్కిన ‘ఎల్ 2: ఎంపురాన్’ ప్రేక్షకుల అంచనాలకు మించి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న విషయం తెలిసిందే. కేవలం నాలుగున్నర రోజుల్లోనే రూ.200 కోట్ల క్లబ్లో చేరి రికార్డులు సృష్టించింది. ఇప్పటి వరకూ అత్యధిక వసూళ్లు (రూ.250+ కోట్లు) మలయాళ మూవీగా అరుదైన రికార్డు క్రియేట్ చేసింది. అయితే ఈ మూవీపై కొన్ని వర్గాల నుంచి విమర్శలు ఎదురు కావడంతో కాస్త వివాదం నెలకొంది. అయినా భారీ కలెక్షన్స్ రాబట్టింది.