ఓటీటీలోకి రావు రమేశ్‌ ‘‘మారుతీనగర్‌ సుబ్రమణ్యం’’.. స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే

Mana Enadu: మనిషన్నాక కూసింత కళాపోసనుండాలి.. ఈ డైలాగ్ వినగానే ప్రతి ఒక్కరికి గుర్తొచ్చే పేరు రావు గోపాలరావు (Rao Gopal Rao). ఆయన కుమారుడిగా టాలీవుడ్‌లోకి అడుగుపెట్టారు రావు రమేశ్‌ (Rao Ramesh). వారసుడిగా నాలుగు పదుల వయసులో అడుగుపెట్టి క్యారెక్టర్ ఆర్టిస్టుగా మంచి పేరు తెచ్చుకున్నారు. రావు రామేశ్ ఉంటే ఎంటర్‌టైన్‌మెంట్ గ్యారంటీ అనేలా పేరు సంపాదించారు.

సాధారణంగా రావు రమేశ్ ఒక పది, పదిహేను నిమిషాలు స్క్రీన్‌పై కనిపిస్తేనే ప్రేక్షకుల్లో ఉత్సాహం కనిపిస్తుంది. అలాంటిది ఆయనే ప్రధాన పాత్రలో ఒక సినిమా చేస్తే, రెండున్నర గంటలు కథ ఆయన చుట్టూనే తిరిగితే ఊహించడానికి భలే అనిపిస్తుంది కదా. ఇలాంటి పాత్ర దొరికితే ఆయన చించేస్తారు కదా. అచ్చం అలాంటి పాత్రే ‘మారుతీనగర్‌ సుబ్రమణ్యం’ (Maruthi Nagar Subramanyam) అనే సినిమాతో రావు రమేశ్ తలుపు తట్టింది.

ఆయన ప్రధాన పాత్రలో ఇంద్రజ (Indraja), అంకిత్‌ కొయ్య, రమ్య పసుపులేటి కీలక పాత్రల్లో నటించిన మారుతీనగర్ సుబ్రమణ్యం సినిమాను లక్ష్మణ్‌ కార్య తెరకెక్కించారు. ఆగస్టు 23వ తేదీన విడుదలైన ఈ సినిమా థియేటర్లలో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు త్వరలో మనముందుకొస్తోంది. ఈనెల 20వ తేదీ నుంచి ప్రముఖ ఓటీటీ ‘ఆహా’ (Aha)లో మారుతీ నగర్ సుబ్రమణ్యం (Maruthi Nagar Subramanyam ott release date) సినిమా స్ట్రీమింగ్‌ కానుంది.

ఈ విషయాన్ని తెలియజేస్తూ ఆహా టీమ్ సోషల్ మీడియాలో పోస్టు పెట్టింది. మ‌ధ్య త‌ర‌గ‌తికి చెందిన ఓ మ‌ధ్య‌ వ‌య‌స్కుడి నిరుద్యోగ క‌ష్టాల చుట్టూ సాగే క‌థతో రూపొందిన ఈ సినిమా ఆగస్టులో థియేటర్లలో విడుదలై ఆకట్టుకుంది. ప్రముఖ దర్శకుడు సుకుమార్‌ (Sukumar) సతీమణి తబితా ఈ చిత్రానికి సమర్పకురాలిగా వ్యవహరించారు. ఇక ఈ వీకెండ్‌ రోజున రావు రమేశ్ ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్‌టైనర్‌ను హాయిగా మీ కుటుంబంతో కలిసి ఆస్వాదించండి.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *