రూ.2వేల నోట్లు..ఇంకా 4రోజులే..!

హైదరాబాద్​: రూ.2వేల నోట్లను ఉపసంహరించుకుంటున్నట్లు RBI ఇప్పటికే ప్రకటించింది. 30 సెప్టెంబర్​ 2023 వరకు నోట్ల మార్పిడి అవకాశం ఇచ్చింది. మొత్తంగా రూ.3.56లక్షల కోట్ల రూ.2వేల నోట్ల చెలామణిలో ఉన్నట్లు తెలిపింది. 

బ్యాంకుల ద్వారా రూ.వేల నోట్లను డిపాజిట్​ చేసుకోవాలని ఆర్​బీఐ విస్తృతంగా ప్రజలకు ప్రచారం కల్పించింది. కానీ నేటికి 10శాతం కూడా మార్పిడి జరగలేదని బ్యాంకు వర్గాలు తెలుపుతున్నాయి. మరో నాలుగు రోజుల మాత్రమే గడువు ఉండటంతో నోట్ల మార్పిడి కోసం పెద్ద సంఖ్యలో వచ్చే అవకాశం ఉందని బ్యాంకుల్లో డిపాజిట్​ కౌంటర్లు పెంచే ఏర్పాట్లు సైతం చేస్తున్నారు.

మరికొంతమంది మాత్రం నోట్ల మార్పిడికి గడుపు పెంచుతారానే ఆలోచనలో ఉన్నారని తెలుస్తుంది. కానీ ఆర్​బీఐ ఇప్పటికే ఆరు నెలలు గడువు ఇచ్చింది. మరోసారి నోట్ల మార్పిడిపై గడువు పెంచే ప్రస్తక్తి లేదని స్పష్టం చేసింది. అక్టోబర్​ మొదటిరోజు నుంచే రూ.2వేల నోట్ల చెలామణి కావని తెలిపింది.

Related Posts

హీరో విడా VX2 ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్.. ఫీచర్లు అదుర్స్! ధర ఎంతంటే..?

హీరో ఎలక్ట్రిక్ సబ్సిడరీ(Hero Electric Sabsidari) అయిన విడా(Vida VX2) సంస్థ తాజాగా తన కొత్త ఫ్యామిలీ ఎలక్ట్రిక్ స్కూటర్ VX2(Famely Electric Schooter)ను మార్కెట్‌లోకి విడుదల(Lanched) చేసింది. ఈ స్కూటర్‌ను రెండు వేరియంట్లలో అందిస్తున్నారు – Go మరియు Plus.…

Gold Rate Today: పెరిగిన బంగారం, వెండి ధరలు.. ఈరోజు ఎంతంటే?

బంగారం ధరలు రోజురోజుకూ పెరుగుతూ కొనుగోలుదారులకు చుక్కలు చూపిస్తున్నాయి. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న యుద్ధ పరిస్థితులు పుత్తడి ధరల పెరుగులదలకు ప్రధాన కారణమని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం ఇరాన్-ఇజ్రాయెల్ వార్, అమెరికా టారిఫ్స్, రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం తదితరాల…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *