
తెలంగాణ హైదరాబాద్లో గతనెల 22న MMTS Trainలో యువతిపై అత్యాచారయత్నం జరిగిందన్న వార్త సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. దీంతో ఈ కేసును ఛాలెంజ్గా తీసుకున్న రైల్వే పోలీసులు(Railway Police) దాదాపు నెలరోజులుగా దర్యాప్తు చేశారు. దీంతో వారికి షాకింగ్ నిజాలు వెల్లడయ్యాయి. అసలు సదరు యువతి(Women)పై అత్యాచారమే జరగలేదని సంచలన ప్రకటన చేశారు. యువతి కావాలనే అందరినీ తప్పుదోవ పట్టించిందని రైల్వే ఎస్పీ చందనా దీప్తి(Railway SP Chandana Deepti) తెలిపారు. ట్రైన్లో రీల్స్(Reels) చేస్తుండగా యువతి రైలు నుంచి కింద జారిపడినట్లు పోలీసుల విచారణలో తేలినట్లు వెల్లడించారు. ఈ కేసులో 250CC కెమెరాలు పరిశీలించి 100 మంది అనిమానితులను పరిశీలించినప్పటికీ అత్యాచార యత్నం జరిగినట్లు ఎక్కడా ఆధారాలు(Evidance) దొరకలేదన్నారు. దీంతో ఈ మేరకు కేసును క్లోజ్ చేసినట్లు SP ప్రకటించారు.
ఇంతకీ ఏమైందంటే..
సికింద్రాబాద్ (Secunderabad) నుంచి మేడ్చల్ (Medchal) వెళుతుండగా MMTSలో గుర్తు తెలియని వ్యక్తి తనపై అత్యాచారయత్నం చేశాడంటూ ఓ యువతి పేర్కొంది. మార్చి 22న కొంపల్లి సమీప ప్రాంతంలోని రైలు బ్రిడ్జి వద్ద కిందపడి గాయపడిన ఆమెను తొలుత గాంధీ ఆసుపత్రికి, ఆ తర్వాత ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. అప్పుడు పైతతంగాన్ని ఆ యువతి పోలీసులకు చెప్పింది. అయితే తాజా విచారణలో అదంతా కట్టుకథ అని పోలీసులు తేల్చారు. కాగా ప్రస్తుతం ఆమె పూర్తిగా కోలుకున్నట్లు తెలుస్తోంది.