‘దేవుణ్నైనా రాజకీయాలకు దూరంగా ఉంచండి’.. తిరుమల లడ్డూ కేసులో సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యలు

Mana Enadu : తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారం (Tirumala Laddu Controversy) దేశవ్యాప్తంగా దుమారం రేపిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంలో ఇప్పటికే ఏపీ సర్కార్ చర్యలు చేపట్టింది. తాజాగా ఈ విషయంపై  దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు (Supreme Court) విచారణ జరిపింది. ఈ మేరకు జస్టిస్​ బి.ఆర్​.గవాయ్, జస్టిస్​ కె.వి. విశ్వనాథన్​తో కూడిన ధర్మాసనం లడ్డూ కల్తీ వ్యవహారంపై కీలక వ్యాఖ్యలు చేసింది. కనీసం దేవుడినైనా రాజకీయాలకు దూరంగా ఉంచాలని కోరుతూనే.. లడ్డూ వ్యవహారంపై సిట్​ కొనసాగించాలా? లేదా అని సహకారం ఇవ్వాలని ఎస్​జీని సుప్రీంకోర్టు కోరింది.

కోట్ల మంది భక్తుల మనోభావాలతో కూడిన వ్యవహారమిది. స్వతంత్ర విచారణ జరపాలా? లేదా? అనేది కేంద్ర ప్రభుత్వం (Central Govt) చెప్పాలి. సిట్​ను కొనసాగించాలో లేదో కూడా చెప్పాలి. సెకండ్ ఒపీనియన్ తీసుకోకుండా సీఎం మీడియాతో మాట్లాడారు. లడ్డూలో కల్తీ నెయ్యి కలిపారనేదానికి ఆధారాలేంటి అని సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని టీటీడీ (TTD)ని ప్రశ్నించింది. అనంతరం విచారణను గురువారానికి సుప్రీంకోర్టు వాయిదా వేసింది.

లడ్డూ కల్తీ వ్యవహారంపై సుప్రీంకోర్టులో సుబ్రహ్మణ్యస్వామి(BJP), వైవీ సుబ్బారెడ్డి(YSRCP), రచయిత విక్రమ్​ సంపత్​, పలువురు న్యాయవాదులు  దాఖలు చేసిన పిటిషన్లపై జస్టిస్​ బి.ఆర్​.గవాయ్, జస్టిస్​ కె.వి.విశ్వనాథన్​ ధర్మాసనం విచారణ జరిపింది. ప్రసాదం కల్తీ (Tirumala Laddu Adulteration)పై వాస్తవాలు తేల్చాలన్న సుబ్రహ్మస్వామి, సుప్రీంకోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు చేయాలని కోరగా.. ప్రసాదం కల్తీపై నిజానిజాలు నిగ్గు తేల్చాలని, సుప్రీంకోర్టు పర్యవేక్షణలో కమిటీ ఏర్పాటు చేయాలని వైవీ సుబ్బారెడ్డి విజ్ఞప్తి చేశారు. 

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *