Thandel: ‘తండేల్’ సక్సెస్ సెలబ్రేషన్స్.. సాయి పల్లవి ఎందుకు రావట్లేదంటే?

అక్కినేని నాగచైతన్య(Naga Chaitanya), సాయి పల్లవి(Sai Pallavi) జోడీగా వచ్చిన లేటెస్ట్ మూవీ ‘తండేల్‌(Thandel)’. చందు మొండేటి(Chandu Mondeti) దర్శకత్వంలో గీతా ఆర్ట్స్‌ పతాకంపై అల్లు అరవింద్ సమర్పణలో బన్నీవాస్‌(Bunny Vasu) ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇటీవల విడుదలైన ఈ చిత్రం మంచి టాక్‌ను సొంతం చేసుకుంది. ఈ చిత్రంలో హీరోతో పాటు సమానమైన పాత్రలో సాయి పల్లవి కనిపించింది. మూవీ రిలీజ్ తర్వాత నాగచైతన్యతో పాటు ఆమె నటనకు కూడా మంచి ప్రశంసలు లభిస్తున్నాయి. అయితే ఈ చిత్రానికి టాక్‌ బాగున్నా ఆశించిన స్థాయిలో వసూళ్లు(Collections) రావడం లేదని ట్రేడ్‌ వర్గాల టాక్‌.

బిజీగా ఉండటం వల్లే రాలేకపోతున్నారా?

ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్‌ సినిమా విడుదల తరువాత కూడా ప్రమోషన్స్‌(Promotions)ను కొనసాగిస్తోంది. అయితే సినిమా విడుదల తరువాత ఇప్పటి వరకు జరిగిన ఏ ప్రమోషన్‌లో కూడా సాయి పల్లవి కనిపించలేదు. పైగా సక్సెస్‌ సెలబ్రేషన్స్‌(Success Celebrations), ప్రెస్‌మీట్స్‌, ఇంటర్వ్యూల్లో ఎక్కడా కూడా హీరోయిన్‌ కనిపించకపోవడం చర్చనీయాంశంగా మారింది. అయితే సాయి పల్లవి బిజీగా ఉండటం వల్లే రాలేకపోతున్నారని చిత్ర యూనిట్‌ చెబుతోంది.

Image

ఆ సీన్లు తొలగించడంపై అభ్యంతరం

కానీ దీనికి మరో కారణం కూడా ఉందని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. సినిమాలో సాయి పల్లవి నటించిన కొన్ని కీలక సన్నివేశాలు(Key scenes) డైరెక్టర్ తొలగించడమే కారణమని సమాచారం. తన సీన్స్‌ను తొలగించడంపై ఆమె తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారని, దీంతో సినిమా రిలీజ్‌ తరువాత ఆమె పబ్లిసిటీ(publicity)కి దూరంగా ఉంటున్నారని తెలుస్తోంది. అయితే దర్శకుడు చందు మొండేటి మాత్రం సాయి పల్లవిని బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నారట.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *