SC Classification Bill: ఎస్సీ వర్గీకరణ బిల్లుకు అసెంబ్లీ గ్రీన్‌సిగ్నల్

తెలంగాణ అసెంబ్లీ(Telagana Assembly) మరో ప్రతిష్ఠాత్మక బిల్లుకు ఆమోదం తెలిపింది. ఎస్సీ వర్గీకరణ బిల్లు(SC Classification Bill)కు గ్రీన్‌ సిగ్నల్ ఇచ్చింది. రాష్ట్రంలోని 59 SC కులాలను 3 గ్రూపులుగా వర్గీకరిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Govt) సభలో బిల్లును ప్రవేశపెట్టింది. ఈమేరకు గ్రూపు-1 కేటగిరీలో అత్యంత వెనుకబడిన 15 కులాలకు ఒకశాతం, మాదిగలున్న గ్రూపు-2లోని కులాలకు 9%, మాలలున్న గ్రూపు-3లోని కులాలకు 5% రిజర్వేషన్లు(Reservations) కల్పిస్తూ బిల్లును ప్రవేశపెట్టింది. దీనిపై సభలో చర్చ అనంతరం SC వర్గీకరణ బిల్లుకు సభ ఆమోదం తెలిపిందని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్( Speaker Gaddam Prasad Kumar) తెలిపారు.

TG Assembly Passes 2 Bills Enhancing BC Reservations to 42%

అంతకుముందు బిల్లుపై చర్చ సందర్భంగా సీఎం రేవంత్ మాట్లాడారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి దళితులకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటోందని చెప్పారు. పార్టీలో, ప్రభుత్వంలో ఎస్సీలకు కాంగ్రెస్ ఎన్నో అవకాశాలు ఇచ్చిందని తెలిపారు. దశాబ్దాల పోరాటంలో ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారని, ఇన్నాళ్లకు తాను సీఎంగా ఉన్నప్పుడు ఈ సమస్య పరిష్కారం కావడం ఆనందంగా ఉందని రేవంత్ రెడ్డి అన్నారు.

సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన గంటలోనే నిర్ణయం

అలాగే సుప్రీంకోర్టు(Supreme Court) తీర్పు వచ్చిన గంటలోపే ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా నిర్ణయం ప్రకటించామని ఆయన గుర్తు చేశారు. బాబూ జగ్జీవన్ రామ్‌(Babu Jagjivan Ram)కు కేంద్రంలో వివిధ శాఖల బాధ్యతలను అప్పగించి గౌరవించిందని పేర్కొన్నారు. దేశంలోనే తొలిసారిగా ఎస్సీ వ్యక్తి దామోదర సంజీవయ్యను CMగా చేసిందని గుర్తు చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఎస్సీ వర్గీకరణ కోసం పోరాటం జరిగిందని సీఎం ఈ సందర్భంగా వివరించారు.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

Telangana Assembly: నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సెషన్స్.. దానిపైనే ప్రధాన చర్చ!

తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు(Telangana Assembly special sessions) నేటి (ఆగస్టు 30) నుంచి మూడు రోజుల పాటు జరగనున్నాయి. ఈ మేరకు ఉదయం 10:30 గంటలకు ప్రారంభం కానున్నాయి. తొలిరోజు ఉభయసభల్లో తొలుత ఇటీవల మరణించిన MLAలు, మాజీ సభ్యులకు…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *