తెలంగాణ ప్రజలకు గుడ్​ న్యూస్​..ఉచిత కరెంటు పథకానికి ఇలా చేయండి

మన ఈనాడు: కాంగ్రెస్​ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఉచిత కరెంటు పథకం అందిస్తామని హామీనిచ్చిన సంగతి తెలిసిందే..ఈక్రమంలోనే సీఎం రేవంత్​రెడ్డి సర్కారు ఉచిత కరెంటు పథకానికి అర్హులను గుర్తించేందుకు సిద్దమైనట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించి విద్యుత్​శాఖ విడుదల చేసినట్లుగా సర్కూలర్​ సోషల్​ మీడియాలో చక్కెర్లు చేస్తుంది.

గృహజ్యోతి పథకం కింద 200యూనిట్లు లోప విద్యుత్తు వినియోగించే వినియోగదారులకు ఉచిత కరెంటు అందించేందుకు తెలంగాణ సర్కారు సిద్దం అయింది.దీంట్లో భాగంగా రేపటి నుంచి మీటరు రీడింగ్​ తీసుకునేందుకు అర్టిజెన్స్​కు రేషన్​కార్డు, ఆధార్​ కార్డు నెంబరును అనుసంధానం చేసుకోవాలని విద్యుత్తుశాఖ ప్రకటించింది. దీంతో గృహజ్యోతి పథకానికి అర్హులైన వారి జాబితా ప్రకటించేందుకు సులువుగా ఉంటుందని ఉన్నతాధికారులు గుర్తించినట్లు సమాచారం.

ఫిబ్రవరిలో వినియోగించే విద్యుత్తుకు 200యూనిట్లు వాడే వారికి గృహజ్యోతి పథకం కింద ఉచిత కరెంటు పథకం అందించబోతున్నట్లు తెలుస్తుంది. ఈనెలలో మరో రెండు గ్యారంటీలు అమలు చేస్తున్నామని ఇప్పటికే సీఎం రేవంత్​రెడ్డి ప్రకటించారు.

Share post:

లేటెస్ట్