Praja Palana : తెలంగాణ ప్రజలకు అలెర్ట్.. 2 రోజులు దరఖాస్తులు బంద్!

మన ఈనాడు:తెలంగాణ ప్రజలకు షాక్ ఇచ్చింది రేవంత్ సర్కార్. రెండు రోజులపాటు దరఖాస్తుల ప్రక్రియ బంద్ కానుంది. రేపు, ఎల్లుండి దరఖాస్తులకు సెలవు ప్రకటించింది తెలంగాణ ప్రభుత్వం. ఈ నేపథ్యంలో దరఖాస్తులకు గడువు పెంచాలని తెలంగాణ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

6 Guarantees Applications : తెలంగాణ ప్రభుత్వం ఆరు గ్యారెంటీల పథకాల అమలు కోసం ప్రజాపాలన కార్యక్రమం కింద దరఖాస్తులు సేకరిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా 2 రోజులు దరఖాస్తుల ప్రక్రియ బంద్ కానుంది. రేపు, ఎల్లుండి దరఖాస్తులకు సెలవు ప్రకటించింది. రేపు డిసెంబర్ 31, ఎల్లుండి కొత్త సంవత్సరం కావడంతో 2రోజుల పాటు దరఖాస్తులకు అధికారిక సెలవు ప్రకటించింది తెలంగాణ ప్రభుత్వం. మళ్లీ 2వ తేదీ నుంచి 6 వరకు దరఖాస్తుల స్వీకరణ చేయనుంది. 28న మొదలైన దరఖాస్తుల స్వీకరణ 2రోజుల సెలవులు తీసేస్తే 8 రోజులే అవుతోంది. ఈ నేపథ్యంలో దరఖాస్తులకు గడువు పెంచాలని డిమాండ్ చేస్తున్నారు తెలంగాణ ప్రజలు.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *