పోలీసు శాఖ సంచలన నిర్ణయం.. 39 మంది టీజీఎస్పీ కానిస్టేబుళ్ల సస్పెన్షన్‌

Mana Enadu : తెలంగాణ పోలీసులకు రాష్ట్ర ప్రభుత్వం(Telangana Govt) షాక్ ఇచ్చింది. బెటాలియన్‌ పోలీస్‌ కానిస్టేబుళ్ల ఆందోళన నేపథ్యంలో కఠిన నిర్ణయం తీసుకుంది. మొత్తం 39 మంది బెటాలియన్‌ కానిస్టేబుళ్లపై సస్పెన్షన్ వేటు వేసింది. వారిని సస్పెండ్ చేస్తున్నట్లు శనివారం రాత్రి పోలీసు ఉన్నతాధికారులు ప్రకటన విడుదల చేశారు. క్రమశిక్షణగా ఉండాల్సిన శాఖ(Telangana Police)లో పని చేస్తూ ఆందోళనకు దిగడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు.

చెప్పినా ఆందోళనలు ఆపలేదు

గత నాలుగైదు రోజులుగా కానిస్టేబుళ్ల కుటుంబాలు రోడ్లపై బైఠాయించి ధర్నాలు(Constable Protests) చేస్తున్న విషయం తెలిసిందే. ఒకానొక దశలో సచివాలయం ముట్టడి, బెటాలియన్ల ముందు ఆందోళనకు దిగారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కఠిన నిర్ణయం తీసుకుంది. సెలవుల విషయంలో ఇటీవల ఇచ్చిన ఉత్తర్వులను వెనక్కి తీసుకుని, ఇంకేమైనా సమస్యలుంటే తమ దృష్టికి తీసుకురావాలని డీజీపీ జితేందర్(Telangana DGP Jithender) చెప్పినా వారు ఆందోళనలు చేయడంపై ఉన్నతాధికారులు మండిపడుతున్నారు. ఇలాగే కొనసాగితే మరింత కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

39 కానిస్టేబుళ్లపై వేటు

“ఆందోళనకు కారణమైన వారిని, రెచ్చగొట్టిన వారిని గుర్తించి చర్యలు తీసుకున్నాం. సస్పెన్షన్​కు గురైన వారిలో 3వ బెటాలియన్​కు చెందిన ఆరుగురు కానిస్టేబుళ్లు, 4వ బెటాలియన్​లో ఆరుగురు, 5వ బెటాలియన్​లో ఆరు, 6వ బెటాలియన్​లో ఐదుగురు, 12వ బెటాలియన్​లో ఐదుగురు, 13వ బెటాలియన్​లో ఐదుగురు, 17వ బెటాలియన్​లో ఆరుగురు కానిస్టేబుళ్లు ఉన్నారు. పోలీస్‌ శాఖలో పనిచేస్తూ ఆందోళనల ద్వారా సామాన్య ప్రజలకు ఇబ్బంది కలిగిస్తే సహించం.” అని పోలీసు ఉన్నతాధికారులు స్పష్టం చేశారు.

 

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *