Adilabad: కన్నుల పండుగగా గిరిజన వేడుక.. పూజలతో పులకించిన నాగోబా క్షేత్రం

మన ఈనాడు:ప్రపంచంలోని అతిపెద్ద గిరిజన ఉత్సవాల్లో ఒకటైన నాగోబా జాతర అంరంగ వైభవంగా మొదలైంది. ఆదిలాబాద్‌ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్‌లోని నాగోబా క్షేత్రంలో గంగా జలాభిషేకంతో జాతరకు శ్రీకారం చుట్టారు. ఫిబ్రవరి 15 వరకు ఈ ఉత్సవాలు కొనసాగనున్నాయి.

ప్రపంచంలోని అతిపెద్ద గిరిజన ఉత్సవాల్లో ఒకటిగా గుర్తింపు పొందిన నాగోబా జాతర ప్రారంభమైంది. ఆదిలాబాద్‌(Adilabad) జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్‌లోని నాగోబా క్షేత్రంలో అంరంగ వైభవంగా జాతర ఉత్సవాలు జరుగుతున్నాయి. నాగ శేషుడుని పూజించే ఈ నాగోబా జాతర గంగాజలాభిషేకంతో శ్రీకారం చుట్టారు. మేస్రం వంశీయులు ఆలయ గర్బగుడిలో‌ నవధాన్యాలు, పాలు ఉంచి ప్రత్యేక పూజలు చేయగా.. నవదాన్యాలు, పాలకలశం పై కప్పిన తెల్లని వస్త్రం కదలడంతో నాగ శేషుడి ఆశీర్వాదం దొరికిందని ప్రధాన పూజను‌ నాగోబా ఆలయ మేస్రం పూజరులు ఆరంభిస్తారు. రాష్ట్రంలో మేడారం తర్వాత రెండో అతిపెద్ద గిరిజన జాతరగా గుర్తింపు పొందిన నాగోబా జాతరను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తోంది.

అయితే, జాతర ప్రారంభానికి ఒక రాగి చెంబులో కొన్ని పాలను పోసి.. నవధాన్యాలు, మొలకలు అన్నిటికీ ఒక కొత్త రుమాలును కప్పి గర్బగుడిలోని పుట్టపైన పెడతారు. అయితే, ఆ పుట్టమీద ఉన్న రుమాలు కదిలితేనే.. జాతరకు నాగదేవత అనుమతి ఇచ్చారని అక్కడి వారి నమ్మకం. నాగోబా జాతర ఆదివాసీ సమాజానికి కీలకమైన పండుగ. చెట్టుకొకరు పుట్టకొకరుగా ఉన్న ఆదివాసీ సమాజాన్ని ఐక్యం చేసే మహా జాతరగా నాగోబాకు ప్రత్యేక స్థానం ఉంది. ఆదివాసీల ఆరాధ్య దైవమైన నాగోబా ఆ నిమిషాన పురివిప్పి నాట్యం అడుతాడని .. సాయంత్రం 7గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు నాగోబా ఆలయంలో పూజారులకు ఆదిశేషువు కనిపిస్తాడనీ.. వారందించే పాలు తాగి ఆశీర్వదించి అదృశ్యమవుతాడనిన మెస్రం వంశీయుల అపార నమ్మకం.

Related Posts

Shubhanshu Shukla-PM Modi: స్పేస్‌లో ఉన్న శుభాంశు శుక్లాతో మాట్లాడిన ప్రధాని మోదీ

భారత అంతరిక్ష రంగం(Indian space sector)లో ఒక కొత్త అధ్యాయం ఆరంభమైంది. భారత వాయుసేన గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లా(IAF Group Captain Shubhanshu Shukla) అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS)లోకి అడుగుపెట్టిన తొలి ఇండియన్‌గా చరిత్ర సృష్టించారు. ఈ హిస్టారికల్…

ISS: అంతరిక్షంలో ఎక్కువ రోజులు గడిపిన వ్యోమగామి ఎవరంటే?

సునీతా విలియమ్స్(Sunita Williams) 9 నెలలు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ISS)లో గడిపారు. భూమికి దాదాపు 4,000KM ఎత్తులో ఉన్న ఆమె రోజులు, అనుభవాలు అసాధారణమైనవి. కానీ ఇప్పుడు, ఎన్నో అనుభవాలతో, కొత్త జ్ఞాపకాలతో సునీతా విలియమ్స్ తిరిగి వచ్చారు. ఈ రోజు…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *