మేడారం ఎఫెక్ట్​..లక్నవరం బంద్​

మన ఈనాడు:తెలంగాణ (telangana) వాసుల కొంగు బంగారమైన మేడారం జాతర సందర్భంగా నేటి నుంచి లక్నవరం (Laknavaram) సందర్శన నిలిపివేశారు అధికారులు. ఇవాళ్టి నుంచి నుంచి ఫిబ్రవరి 26 వరకు లక్నవరంలో పర్యాటకులకు అనుమతి లేదని అధికారులు, పోలీసులు తెలిపారు.

మేడారం మహా జాతరకు భారీ సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉంది.

భక్తుల రద్దీ, ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ఉండడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. రద్దీ ఎక్కువైతే బ్రిడ్జిపై అనూహ్య పరిస్థితులు తలెత్తే ప్రమాదం ఉందని తెలిపారు. పర్యాటకులు సహకరించాలని పోలీసులు కోరారు.

మేడారం మహాజాతర (Medaram Jatara) కోసం ఇప్పటికే గిరిజన సంక్షేమ శాఖ భారీ ఏర్పాట్లు చేసింది. ఆర్టీసీ కూడా ప్రత్యేక బస్సులను నడుపుతోంది. మేడారం ప్రత్యేక బస్సుల్లోనూ మహాలక్ష్మి పథకం అమలవుతుందని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *