మల్లారెడ్డి ఫ్యామిలీ జంప్​…ముహుర్తం ఎప్పుడంటే..

మన Enadu: పాలు అమ్మినా..పూలు అమ్మినా..తొడగొట్టినా..డైలగ్​ విసిరినా..ఆయన ఏది చేసినా ట్రెండింగ్​లోకి రావాల్సిందే..ఈసారి ఏకంగా బీఆర్​ఎస్​కి షాక్​ ఇచ్చి..సీఎం రేవంత్​ గూటికి వెళ్లేందుకు రెఢీ అయ్యారని సమాచారం.

సోషల్​ మీడియా ట్రెండింగ్​ లీడర్​ మాజీ మంత్రి మల్లారెడ్డి ఫ్యామిలీతో కలిసి కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకునేందుకు రంగం సిద్దమైంది. పార్టీలోకి చేరేందుకు కావాల్సిన ఏర్పాట్లు ఇప్పటికే పూర్తి చేశారు. ఆయనతోపాటు నాగారం, బోడుప్పల్​, ఫీర్జాదిగూడ మున్సిపల్​ ఛైర్మన్లు, మేయర్లును తీసుకెళ్లడానికి ముహుర్తం ఫిక్స్​ చేశారు. కానీ సీఎం రేవంత్​రెడ్డి మాత్రం లైన్​ క్లియర్​ చేయలేదని తెలుస్తుంది.

రేవంతన్న పార్టీలోకి ఒక్కడితో వచ్చేదే లేదు..ఫ్యామిలీతోనే వస్తాను అనుకున్నారా..? కాదు కాదు లక్షమందితో మూడురంగుల కండువా కప్పుకుంటా..భారీ బహిరంగ సభతోపాటు బీఆర్ఎస్​ అడ్రస్​ లేకుండా చేస్తానంటూ ప్లీజ్​..ప్లీజ్​ నన్ను కాంగ్రెస్​లో జాయిన్​ చేర్చుకుండంటూ సీఎం రేవంత్​ సన్నిహితుల వద్ద ప్రదర్శనలు చేస్తున్నారు. ఒక్కసారి సీఎం రేవంతన్న అపాయింట్​మెంట్​ ఇప్పించాలని కోరగా ఆయన అందుబాటులో లేరని సమాచారం ఇచ్చారు.
ఈనెల 13వ తేది పార్లమెంటు ఎన్నికల కోడ్​ రాబోతుండగా మల్లారెడ్డితోపాటు, అల్లుడు రాజశేఖర్​రెడ్డి, కొడుకు భద్రారెడ్డితో కాంగ్రెస్​ లో జాయిన్​ కావాలని ఫిక్స్​ అయ్యారు. భద్రారెడ్డిని మల్కాజిగిరి నుంచి బీఆర్​ఎస్​ అభ్యర్థిగా పార్లమెంటు బరిలో నిలపాలని అనుకున్నప్పటికీ ఇప్పుడు కాంగ్రెస్​ కుదిరితే సీటు లేదంటే కనీసం జాయిన్​ చేయించుకోవాలని వేడుకున్నారని తెలిసింది. రెండు రోజుల్లోనే మల్లారెడ్డి కాంగ్రెస్​లోకి వెళ్లడం మాత్రం ఫిక్స్ అయిందని తెలుస్తుంది.

Share post:

లేటెస్ట్