కాంగ్రెస్​ తొలి జాబితాలో తొమ్మిది మందికి అవకాశం..

మన Enadu: నాలుగు రోజుల్లో పార్లమెంట్​ ఎన్నికలకు షెడ్యూల్​ విడుదల అవుతుందన్న ప్రచారంతో కాంగ్రెస్​ పెద్దలు అలర్ట్​ అయ్యారు. ఎంపీ అభ్యర్థుల పేర్లును ఖారారు చేసే పని పూర్తి చేశారని సమాచారం. నాలుగు గంటలపాటు జరిగిన సమావేశంలో తెలంగాణ నుంచి తొలిజాబితా తొమ్మిదిమంది పేర్లు దాదాపుగా ఖారారు చేశారని రేపు ప్రకటించే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయని విశ్వసనీయ వర్గాల సమాచారం.

సికింద్రాబాద్​ నుంచి అనూహ్యంగా మరో పేరు తెరమీదకి వచ్చింది. బీసీ సామాజిక వర్గంతోపాటు సికింద్రాబాద్​ ప్రాంతంలో యాదవ్​ బలమైన సామాజిక వర్గం ఉంది. ఈక్రమంలో మాజీ మేయర్​ బొంతు రామ్మోహన్​ సతీమణి ప్రస్తుతం చర్లపల్లి కార్పొరేటర్​గా ఉన్న బొంతు శ్రీదేవి పేరును ఖారారు చేసినట్లు తెలిసింది.

మహబూబాబాద్​ నుంచి విజయాబాయి, మహబూబ్​నగర్​ నుంచి వంశీరెడ్డి, కరీంనగర్​ నుంచి ప్రవీణ్​ రెడ్డి, నిజామాబాద్​ నుంచి జీవన్​రెడ్డి, జహీరాబాద్​ నుంచి సురేష్​ పెట్కార్​, చేవళ్ల నుంచి సునితా మహేందర్​రెడ్డి, నాగర్​కర్నూల్​ నుంచి మల్లు రవి పేర్లు ఖారారు చేశారని పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి.

Share post:

లేటెస్ట్