Rythubandhu: రైతుబంధు నిధులు బ్యాంకు ఖాతాల్లో నేటినుంచే..

మన ఈనాడు : రైతుల ఖాతాల్లో తెలంగాణ ప్రభుత్వం రైతుబంధు నిధులు జమ చేస్తుందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. నిజామాబాద్ జిల్లాలోని నందిపేట మండలంలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన రైతుబంధు నిధుల జమపై క్లారిటీ ఇచ్చారు. ఈ సందర్భంగా జరిగిన సభలో మంత్రి మాట్లాడు తూ…ఎన్ని ఇబ్బందులున్నా రైతు డిక్లరేషన్‌ను అమలు చేసి తీరుతామని స్పష్టం చేశారు. రై తుల సంక్షేమమే తమ ప్రభుత్వ ధ్యేయమని, రై తాంగ ప్రయోజనాలే పరమావధిగా పనిచేస్తామని అన్నారు. నందమూరి తారకరామారావు ఆశీస్సులతో రాజకీయాలలోకి వచ్చిన తామం తా, ఆ మహానుభావుని ఆశయాలకు అనుగుణంగా అదే నిబద్దత, నిజాయితీగా ముందుకెళ్తున్నామని స్పష్టం చేశారు.

ఎన్టీఆర్ శ్రీకారం చుట్టిన సంక్షేమ పథకాలు నేడు దేశమంతటా అన్ని పార్టీలు అమలు చేస్తున్నాయని గుర్తు చే శారు. రైతుల అవసరాలు, కష్టాలు తెలిసిన వ్య క్తిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వం లో రైతుల సంక్షేమానికి చిత్తశుద్ధితో కృషి చేస్తున్నామని తెలిపారు.ఇప్పటికే రెండకరాల లో పు వ్యవసాయ భూమి కలిగిన 29 లక్షల మం ది రైతులకు రైతుబంధు అందించామని, మి గతా రైతులకు కూడా గురువారం నుండే వారి ఖాతాల్లో రైతుబంధు డబ్బులు జమ అయ్యేలా చర్యలు తీసుకున్నామని తెలిపారు. ఈ నెలాఖరులోపు రైతులందరి ఖాతాల్లో రైతుబంధు నిధులు పడతాయని స్పష్టం చేశారు.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *