Rythubandhu: రైతుబంధు నిధులు బ్యాంకు ఖాతాల్లో నేటినుంచే..

మన ఈనాడు : రైతుల ఖాతాల్లో తెలంగాణ ప్రభుత్వం రైతుబంధు నిధులు జమ చేస్తుందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. నిజామాబాద్ జిల్లాలోని నందిపేట మండలంలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన రైతుబంధు నిధుల జమపై క్లారిటీ ఇచ్చారు. ఈ సందర్భంగా జరిగిన సభలో మంత్రి మాట్లాడు తూ…ఎన్ని ఇబ్బందులున్నా రైతు డిక్లరేషన్‌ను అమలు చేసి తీరుతామని స్పష్టం చేశారు. రై తుల సంక్షేమమే తమ ప్రభుత్వ ధ్యేయమని, రై తాంగ ప్రయోజనాలే పరమావధిగా పనిచేస్తామని అన్నారు. నందమూరి తారకరామారావు ఆశీస్సులతో రాజకీయాలలోకి వచ్చిన తామం తా, ఆ మహానుభావుని ఆశయాలకు అనుగుణంగా అదే నిబద్దత, నిజాయితీగా ముందుకెళ్తున్నామని స్పష్టం చేశారు.

ఎన్టీఆర్ శ్రీకారం చుట్టిన సంక్షేమ పథకాలు నేడు దేశమంతటా అన్ని పార్టీలు అమలు చేస్తున్నాయని గుర్తు చే శారు. రైతుల అవసరాలు, కష్టాలు తెలిసిన వ్య క్తిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వం లో రైతుల సంక్షేమానికి చిత్తశుద్ధితో కృషి చేస్తున్నామని తెలిపారు.ఇప్పటికే రెండకరాల లో పు వ్యవసాయ భూమి కలిగిన 29 లక్షల మం ది రైతులకు రైతుబంధు అందించామని, మి గతా రైతులకు కూడా గురువారం నుండే వారి ఖాతాల్లో రైతుబంధు డబ్బులు జమ అయ్యేలా చర్యలు తీసుకున్నామని తెలిపారు. ఈ నెలాఖరులోపు రైతులందరి ఖాతాల్లో రైతుబంధు నిధులు పడతాయని స్పష్టం చేశారు.

Share post:

లేటెస్ట్