టాలీవుడ్ హీరో, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ బుధవారం తెల్లవారుజామున సతీమణి ఉపాసన, కుమార్తె క్లింకారతో కలిసి సుప్రభాత సేవలో స్వామివారిని దర్శించుకున్నారు.
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న రామ్ చరణ్ దంపతులు టాలీవుడ్ హీరో, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ బుధవారం తెల్లవారుజామున సతీమణి ఉపాసన, కుమార్తె క్లింకారతో కలిసి సుప్రభాత సేవలో స్వామివారిని దర్శించుకున్నారు.
రామ్ చరణ్ దంపతులు కుమార్తెతో కలిసి తిరుమల చేరుకున్నారు. హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో తిరుపతి చేరుకున్నారు. రామ్ చరణ్ తిరుపతి వస్తున్నారన్న విషయం తెలుసుకున్న ఆయన అభిమానులు తిరుమల ఆలయం వద్దకు భారీగా తరలివచ్చారు. ఇదిలాఉంటే ఇవాళ రామ్ చరణ్ పుట్టిన రోజు సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున సంబురాలు నిర్వహించేందుకు అభిమానులు సిద్ధమయ్యారు.