Bonakal| బోనకల్ లో రోడ్డు ప్రమాదం..ముగ్గురు మృతి


ManaEnadu: బోనకల్ – ఖమ్మం ప్రధాన రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ముస్టికుంట్ల వద్ద బుధవారం జరిగిన ప్రమాదంలో కారు అదుపు తప్పి రోడ్డు పక్కన చెట్టును ఢీకొంది.ఈ ఘటనలో కారుకి మంటలు అంటుకుని ఎగిసిపడ్డాయి.

కారులో ప్రయాణిస్తున్న భార్య, భర్తలు అక్కడిక్కడే మృతి చెందారు. మరో ఇద్దరి యువకులు కారు మంటల్లో ఇరుక్కున్నారు. వారిని ఖమ్మం ఆసుపత్రికి తరలిస్తుండగా ఒక్కరు ప్రాణాలోదిలారు. మరో యువకుడి పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తుంది. మృతులకి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

మృతులు మధిర పట్టణానికి చెందిన కొత్తూరు సూర్యనారాయణ, రుక్మిణిగా పోలీసులు గుర్తించారు. సూర్యనారాయణ రిటైర్ట్​ జూనియర్​ కాలేజ్​ ప్రన్సిపాల్​గా పనిచేశారు.

Share post:

లేటెస్ట్