Mana Enadu: ప్రధాని నరేంద్రమోదీని మరోసారి ప్రధానిని చేయాలనే కాంక్షతో అన్ని వర్గాల ప్రజలు ఈ ఎన్నికలలో ఉత్సాహంగా ఉన్నారని మల్కాజ్గిరి బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి ఈటెల రాజేందర్ అన్నారు.
తెలంగాణ మొత్తంగా బీజేపీ చాలా శక్తివంతంగా ఉంది. సర్వేసంస్థలకు అందని, ఊహించని విధంగా ఈ జూన్ 4వ తేదీన గొప్ప అద్భుతం జరగబోతోందన్నారు. నాంపల్లి బీజేపీ కార్యాలయంలో మంగళవారం ఈటల రాజేందర్ ప్రెస్మీట్ నిర్వహించారు.బీజేపీ పార్టీ అఖండ విజయం సాధించబోతోందని పేర్కొన్నారు.
ప్రజల తీర్పు నిక్షిప్తంగా ఉంది. పదేళ్ల క్రితం కాంగ్రెస్ పార్టీ ఎలాంటి నీచమైన మాటలు చెప్పిందో అవే మాటలు మళ్లీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా చెప్తున్నాడని విమర్శలు చేశారు.
నేడు ప్రధాని మోదీ పదేళ్ల పాలనలో దేశం ఎంతో అభివృద్ధి చెందింది. ఎక్కడా బాంబుల పేలుళ్లు లేవు. అందరూ ప్రశాంతంగా జీవిస్తున్నారు.
మేము ప్రచారం నిమిత్తం ఏ ఇంటికి పోయినా సాదరంగా ఆహ్వానించి బీజేపీకే ఓటు వేస్తామంటున్నారు.
తెలంగాణలో ఖచ్చింతంగా అమిత్షా చెప్పినట్లు 12 ఎంపీ స్థానాలను గెలుచుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. రేపటి భవిష్యత్తు తెలంగాణలో బీజేపీదే అన్నారు.
రాష్ట్రమేలు కోసం బీజేపీ ఎంపీగా పార్టీ ఇచ్చిన మేనిఫెస్టోను ఖచ్చితంగా అమలు చేస్తానని హామీ ఇస్తుందన్నారు.
Rashmika Mandanna: ‘ఛావా’ ప్రమోషన్స్.. రష్మిక కామెంట్స్పై కన్నడిగుల ఫైర్
ప్రజెంట్ సినీ ఇండస్ట్రీలో నేషన్ క్రష్ రష్మిక మందన్న(Rashmika Mandanna) జోరు కొనసాగుతోంది. టాలీవుడ్(Tollywood), బాలీవుడ్(Bollywood) అనే తేడా లేకుండా వరుసబెట్టి ఆఫర్లు సొంతం చేసుకుంటోంది. దీంతో దక్షిణాది ఇండస్ట్రీలలో ఆమె పట్టిందల్లా బంగారమే అవుతోంది. ఇటీవల యానిమల్(Animal), పుష్ప-2(Pushpa2)తో సూపర్…