తొలి విడత సక్సెస్.. రేపటి నుంచి మలిదఫా

మన Enadu: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మలివిడత శంఖరావం యాత్రకు రెడీ అయ్యారు. గురువారం ఉదయం హిందూపురం నుంచి యాత్రకు శ్రీకారం చుట్టనున్నారు.

వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా నారా లోకేశ్ అడుగులు వేస్తున్నారు. ఈ యాత్రలో ఎన్నికలను ఎదుర్కోవాల్సిన అంశాలపై పార్టీ కేడర్‌ను సిద్ధం చేయడంతో పాటు దిశానిర్దేశం చేయనున్నారు. అంతేకాదు టీడీపీ కార్యక్రమాల్లో మెరుగైన పని తీరు కనబర్చిన కార్యకర్తలో భేటీ కానున్నారు. వారికి ప్రశంసా పత్రాలు అందించనున్నారు. ఇక ఈ యాత్రలో భాగంగా గురువారం ఉదయం హిందూపురం, మధ్యాహ్నం మడకశిర, సాయంత్రం పెనుగొండ నియోజకవర్గాల్లో శంఖారావం సభలు నిర్వహించనున్నారు. ఈ నెల 8న పుట్టపర్తి, కదిరి, 9న శివరాత్రి సందర్భంగా తాత్కాలిక విరామం, 10 నుంచి యధావిథిగా శంఖారాయం యాత్ర కొనసాగనుంది.

Related Posts

Tollywood: 18న ఎగ్జిబిటర్లతో ఫిలీం ఛాంబర్ కీలక సమావేశం.. ఎందుకంటే?

థియేటర్లను అద్దె ప్రాతిపదికన(Theaters on rental basis) మీద కాకుండా, పర్సంటేజ్‌(Percentage)ల లెక్కన నడపాలనే వివాదం చినికి చినికి గాలివానగా మారుతోంది. ఇప్పటికే ఈస్ట్, కృష్ణా, సీడెడ్, నైజాంల్లో ఈ నినాదం ఊపు అందుకుంది. దీంతో రెండు రాష్ట్రాల ఎగ్జిబిటర్ల(Exhibitors)తో ఫిలిం…

Rohit Sharma: మహారాష్ట్ర సీఎంతో రోహిత్ శర్మ భేటీ.. పొలిటికల్ ఎంట్రీపై ఊహాగానాలు

టీమిండియా వన్డే కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్(Devendra Fadnavis)ను కలిసిన ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. టెస్టు క్రికెట్‌కు గుడ్బై చెప్పిన హిట్మ్యాన్ ఉన్నట్టుండి మహారాష్ట్ర సీఎంను కలవడంపై రకరకాల ఊహాగానాలు…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *