హాట్సాఫ్ భైరవ.. తోటి కుక్కకు బ్లడ్ డొనేట్ చేసి ప్రాణాలు కాపాడిన డాబర్‌మన్‌

Mana Enadu:సాధారణంగా మనుషులు ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు వారికి రక్తం అవసరం ఏర్పడే పరిస్థితులు వస్తాయి. ఆ సమయంలో ఆస్పత్రుల్లో ఉన్న బ్లడ్ బ్యాంకుల్లో నుంచి బ్లడ్ తీసుకువచ్చి పేషెంట్​కు ఇన్ఫ్యూజ్ చేస్తారు. ఒకవేళ పేషెంట్ బ్లడ్ గ్రూప్​నకు సెట్ అయ్యే రక్తం దొరకకపోతే తెలిసిన వాళ్లెవరిదైనా సరిపోలితే వారి నుంచి రక్తం సేకరించి ఎక్కిస్తారు. ఒకవేళ ఇదే పరిస్థితి పశువులకు వస్తే ఏం చేస్తారు? మనుషుల్లాగే పశువులకూ బ్లడ్ ఎక్కిస్తారా? ఇలాంటి అరుదైన సంఘటన చోటుచేసుకుంది కర్ణాటకలో.

ఏం జరిగిందంటే..?

కర్ణాటకలోని కొప్పళ జిల్లా కేంద్రానికి చెందిన ఓ వ్యక్తి తన ఇంట్లో లాబ్రడార్ బ్రీడ్​కు చెందిన కుక్కను పెంచుకుంటున్నాడు. ఆ శునకాన్ని తన ఇంటి సభ్యుడిగా భావిస్తుంది ఆ కుటుంబం. ఓ ఫ్యామిలీ మెంబర్​లా ఆలనా పాలనా చూస్తుంటుంది. అయితే ఇటీవల ఆ కుక్క అస్వస్థతకు గురైంది. ఏమైందని పశువైద్య శాలకు తీసుకెళ్లాడు ఆ వ్యక్తి. అప్పుడు ఆ కుక్కను పరిశీలించిన వైద్యులు దానికి హిమోగ్లోబిన్ తక్కువైందని చెప్పారు. వెంటనే రక్తం ఎక్కించాలని లేకపోతే దాని ప్రాణాలకు ముప్పు ఏర్పడే పరిస్థితి ఉందని అన్నారు. అయితే ఆ యజమానికి అప్పుడు ఏం చేయాలో పాలుపోలేదు.

ఎలాగైనా తన పెట్ డాగ్​ను కాపాడమని డాక్టర్​ను వేడుకున్నాడు. అప్పుడు పశువైద్యాధికారి బసవరాజ్ పూజర్​కు తన పెంపుడు కుక్క గుర్తొచ్చింది. బసవరాజ్ కూడా ఓ కుక్కను పెంచుకుంటున్నారు. దానిపైరు భైరవ. అయితే అది డాబర్​మన్ బ్రీడ్​కు చెందినది. బసవరాజ్ తన శునకం బ్లడ్ గ్రూప్ పరిశీలించి.. పరీక్షించిన తర్వాత లాబ్రడార్​కు దాని రక్తం ఎక్కించొచ్చని నిర్ధారించుకున్నారు. ఈ క్రమంలోనే డాబర్​మన్ నుంచి 300 మి.లీ. రక్తం సేకరించి తొమ్మిదేళ్ల లాబ్రడార్‌కు ఎక్కించారు. కొన్ని రోజుల్లోనే లాబ్రడార్ కోలుకుని మునపటిలా జాలీగా తిరుగుతోంది. ఈ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో నెటిజన్లు డాబర్​మన్​ను తెగ పొగిడేస్తున్నారు. తన తోటి కుక్కకు రక్తం ఇచ్చి కాపాడినందుకు థాంక్స్ చెబుతున్నారు. కుక్కలకు విశ్వాసంగా ఉండటమే కాదు.. సాయం చేయడమూ వచ్చంటూ కామెంట్లు చేస్తున్నారు.

 

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *