Telangana : డెంగీ డేంజర్.. జ్వరమొస్తే అనుమానించాల్సిందే

ManaEnadu:వానాకాలం వచ్చిందంటే చాలు సీజనల్ వ్యాధులు వ్యాపిస్తుంటాయి. ఆస్పత్రులు రోగులతో కిటకిటలాడుతుంటాయి. ముఖ్యంగా జ్వరపీడితులతో రద్దీగా మారుతుంటాయి. ఇక వర్షాకాలంలో డెంగీ దోమలు విజృంభిస్తుంటాయి. ఈ క్రమంలోనే తాజాగా తెలంగాణ రాష్ట్రంలో డెంజీ విపరీతంగా విజృంభిస్తోంది. భారీగా కేసులు పెరుగుతుండటంతో ఆరోగ్య శాఖ ఆందోళన వ్యక్తం చేస్తోంది. వెంటనే డెంగీ కట్టడికి చర్యలు తీసుకోవడంపై దృష్టి సారిస్తోంది.

రెండు నెలల్లో 4వేలకు పైగా కేసులు

ఈ ఏడాదిలో ఇప్పటి వరకు 5,372 మంది డెంగీ జ్వరం బారినపడ్డారు. జూన్​లో 1,078 మంది ఈ జ్వరంతో బాధపడగా.. గత రెండు నెలల్లో ఏకంగా ఈ కేసులు 4,294 నమోదయ్యాయి. ఇక డెంగీ నిర్ధారణకు చేస్తున్న పరీక్షల్లో 6.5 శాతం పాజిటివ్​గా నిర్దారణ అవుతున్నాయి. అంటే ప్రతి 200 శాంపిల్స్​లో 13 మంది డెంగీ బారిన పడుతున్నారన్నట్టు. ముఖ్యంగా హైదరాబాద్​లో అత్యధికంగా.. ఆ తర్వాత సూర్యాపేట, మేడ్చల్, ఖమ్మం, నల్గొండ, నిజామాబాద్, రంగారెడ్డి, జగిత్యాల, సంగారెడ్డి, వరంగల్ జిల్లాల్లో ఈ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి.

గన్యా కేసులూ పెరుగుతున్నాయి..

మరోవైపు రాష్ట్రంలో గన్యా కేసులూ పెరుగుతున్నాయని వైద్యఆరోగ్య శాఖ వెల్లడించింది. గన్యా ఉందన్న  అనుమానంతో 2,673 నమూనాలను పరీక్షించగా 152మందికి పాజిటివ్ నిర్ధారణ అయినట్లు తెలిపింది. ఈ కేసులు అత్యధికంగా హైదరాబాద్, వనపర్తి, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లో బయటపడుతున్నాయని పేర్కొంది. ఈ కాలంలో పిల్లలకు జ్వరం వస్తే తొలుత డెంగీగానే అనుమానించి పరీక్షలు చేయించాలని వైద్యులు సూచిస్తున్నారు.

జ్వరం వస్తే అనుమానించాలి

పిల్లలకు జ్వరం వస్తే వెంటనే ఆస్పత్రికి తరలించి డెంగీ పరీక్షలు చేయించాలి.
జ్వరం వస్తే పారాసిటమాల్‌ తప్ప వైద్యుల సూచన లేకుండా ఎలాంటి మందులు వేసుకోకూడదు.
రెండ్రోజుల వరకు కూడా జ్వరం తగ్గకపోతే వెంటనే ఆస్పత్రికి వెళ్లాలి.
వానాకాలంలో బాగా కాచి చల్లార్చిన నీటినే తాగాలి. ఇక వేడిగా ఉన్న ఆహారాన్నే తీసుకోవాలి.
ఈ కాలంలో బయట ఫుడ్ తినకపోవడమే మంచిది.
101 డిగ్రీల కంటే ఎక్కువ జ్వరం, తీవ్రమైన తలనొప్పి, కళ్ల వెనుక నొప్పి, చలితో కూడిన జ్వరం, వాంతులు, తీవ్ర నీరసం, బీపీ తగ్గిపోవడం వంటి లక్షణాలు గుర్తిస్తే వెంటనే ఆసుపత్రికి వెళ్లి వైద్యుడిని సంప్రదించాలి.

 

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *