Toll Plaza| ఇందల్వాయి టోల్‌ప్లాజా అగ్రస్థానం – వరించిన బంగారు పతకం

Mana Enadu: Indalwai Toll Plaza Got Gold Medal : రహదారుల నిర్వహణలో మెరుగుదల కోసం కేంద్రం టోల్‌ప్లాజాలకు పురస్కారాలు అందిస్తోంది. ఇందులో నిజామాబాద్‌ జిల్లా ఇందల్వాయి టోల్‌ప్లాజా బంగారు పతకం సాధించింది. ‘ఎక్సలెన్స్‌ ఇన్‌ ఆపరేషన్‌ అండ్‌ మెయింటనెన్స్‌-ఫ్లెక్సీబుల్‌’ విభాగంలో జాతీయ స్థాయిలో అగ్రస్థానంలో నిలవడంతో ఈ అవార్డు దక్కింది. రహదారుల నిర్వహణ, రోడ్డు పక్కన, విభాగిని మధ్యలో మొక్కల పెంపకం, నిర్వహణ, ప్రమాదాల నివారణకు తగిన చర్యలు చేపట్టడం వంటివి అంశాలను పరిశీలించి కేంద్ర ప్రభుత్వం అవార్డులు ఇస్తోంది.

నిర్వహణలో పోటీతత్వం తీసుకొచ్చేందుకు 2018 నుంచి ఏటా కేంద్రం అవార్డులు ఇస్తోంది. రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వశాఖ నిర్దేశించిన ఆరు అంశాల్లో మొదటి రెండు స్థానాల్లో నిలిచిన ప్రాజెక్టులకు బంగారు, వెండి పురస్కారాలు లభిస్తాయి. 2022 ఏడాదికి గానూ ఇందల్వాయి టోల్‌ప్లాజా అగ్రస్థానంలో నిలిచి స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకుంది. ఈ అవార్డును గత నెల 6న దిల్లీలో కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ చేతుల మీదుగా ప్రాజెక్టు డైరెక్టర్‌ అనిల్‌సింగ్‌ అందుకున్నారు.

Related Posts

ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. తాగినంత ఆల్కహాల్ ఫ్రీ.. ఆ తర్వాత హ్యాంగోవర్‌ లీవ్

ఉద్యోగులు హ్యాపీగా ఉంటేనే వారు పనిలో శ్రద్ధ చూపిస్తారు. వారు శ్రద్ధగా పని చేస్తేనే సంస్థ అభివృద్ధి బాటలో నడుస్తుంది. అందుకే చాలా కంపెనీలు ఖర్చు ఎక్కువైనా సరే ఉద్యోగుల సంక్షేమం కోసం కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. కొన్ని కంపెనీలు మాత్రం…

హష్‌ మనీ కేసులో ట్రంప్‌నకు శిక్ష : జడ్జి

పోర్న్‌ స్టార్‌కు హష్ మనీ వ్యవహారంలో అమెరికా (America)కు కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌  (Donald Trump) అభియోగాలు ఎదుర్కొంటున్నారు. ఈ కేసులో ట్రంప్‌నకు శిక్ష విధిస్తానంటూ తాజాగా న్యూయార్క్‌ జడ్జి తెలిపారు. అయితే, ఆయన శిక్ష అనుభవించాల్సిన అవసరం లేదని…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *