Telangana| బీఆర్‌ఎస్‌కు మరో షాక్.. కాంగ్రెస్‌లోకి ఖైరతాబాద్ ఎమ్మెల్యే

ManaEnadu:రోజుల్లో పార్లమెంట్ ఎన్నికలు జరగనున్న వేళ తెలంగాణలో ప్రతిపక్ష బీఆర్‌ఎస్ (BRS) పార్టీకి షాక్‌ల మీద షాక్‌లు తగులుతున్నాయి. ఇప్పటికే పలువురు కీలక నేతలు బీఆర్‌ఎస్‌కు గుడ్ బై చెప్పగా తాజాగా అదే బాటలో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ (Khairatabad MLA Danam Nagende) కూడా ఉన్నారు. దానం నాగేందర్ కాంగ్రెస్ పార్టీలో (Congress) చేరనున్నారు. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో నేడు దానం భేటీ అయ్యారు. ఈ భేటీలో తెలంగాణ కాంగ్రెస్ ఇన్‌చార్జ్ దీపా దాస్ మున్షీ, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా పాల్గొన్నారు. దానం నాగేందర్ ఆదివారం కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. కాగా దానం నాగేందర్ రాజకీయ ప్రయాణం కాంగ్రెస్ పార్టీతో ప్రారంభమైంది. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆయన మంత్రిగా కూడా పని చేశారు. ఆ తర్వాత బీఆర్‌ఎస్‌లో చేరారు. తాజాగా మళ్లీ హస్తం గూటికి చేరుతున్నారు.

Related Posts

Telugu Cine Industry: సినీ కార్మికుల సమ్మెకు తెర.. నేటి నుంచి షూటింగ్స్ షురూ

గత 18 రోజులుగా తెలుగు సినీ పరిశ్రమ(Telugu Cine Industry)ను స్తంభింపజేసిన కార్మికుల సమ్మె(Cine Workers strike)కు ఎట్టకేలకు తెరపడింది. కార్మికుల వేతనాలను 22.5 శాతం పెంచేందుకు నిర్మాతలు(Producers) అంగీకరించడంతో ఈ సమ్మె ముగిసింది. తెలంగాణ సీఎ రేవంత్ రెడ్డి(CM Revanth…

Parliament Monsoon Sessions: ముగిసిన పార్లమెంట్ సమావేశాలు.. పలు కీలక బిల్లులకు ఆమోదం

భారత పార్లమెంటు వర్షాకాల సమావేశాలు(Monsoon Sessions of Parliament) వాడీవేడి చర్చలు, నిరసనల మధ్య ముగిశాయి. జూలై 21 నుంచి ఆగస్టు 21 వరకు జరిగిన ఈ సమావేశాలు అనేక కీలక అంశాలపై తీవ్ర చర్చలకు వేదికగా నిలిచాయి. సమావేశాలు 120…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *