Khammam|ఖమ్మం పార్లమెంట్ కి ‘అమ్మ’కావాలి..మార్పు రావాలి

Naresh Chitturi | Updated on: Mar 13, 2024 | 4:00 PM

Mana Enadu: రాజకీయంగా చైతన్యమైన ప్రాంతం..అది కమ్యూనిస్టుల కంచుకోట ఖిల్లా..తెలంగాణ తొలి, మలి ఉద్యమానికి ప్రాణం పోసిన గడ్డ ఖమ్మం(Khammam) జిల్లా..ఖమ్మం పార్లమెంట్​ స్థానంపై పోటీ పెరిగినా ప్రజలు మాత్రం ‘అమ్మ’ రావాలి..మార్పు తేవాలని కోరుకుంటున్నారు.

అమ్మ పౌండేషన్​ ఖమ్మం జిల్లాలో ఈపేరు తెలియని వారు ఉండరు. గడిచిన 17ఏళ్లుగా ప్రత్యక్షంగా కాకపోయిన ప్రజలతోనే కలిసి నడిచిన వ్యక్తి ఆమె. మల్లు నందిని విక్రమార్క తాజాగా కాంగ్రెస్ ఖమ్మం పార్లమెంటు అభ్యర్థిగా రేసులో నిలబడటంతో ఒక్కసారిగా రాజకీయాల్లోకి తెరపైకి వచ్చారు.

ఇప్పటి తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క 2007లో స్థానిక సంస్థల కోటాలా ఎమ్మెల్సీగా మధిర నియోజకవర్గ రాజకీయాల్లో క్రీయశీలకంగా వ్యవహరించారు. 2009లో మధిర నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన భట్టి విక్రమార్క ఇప్పటి డిప్యూటీ సీఎం వరకు తిరుగులేని ప్రజానాయకుడిగా ప్రజల్లో చెరగని ముద్ర వేసుకున్నారు.

తెలంగాణ కాంగ్రెస్​ను అధికారంలోకి తీసుకొచ్చేందుకు రాష్ట్ర రాజకీయాల్లో భట్టి విక్రమార్కంగా బీజీగా ఉన్నారు. ఈక్రమంలోనే రెండు దశాబ్ధాలుగా అమ్మ పౌండేషన్​ స్థాపించి మల్లు నందిని(Mallu Nadhini) జనం అవసరాలు తెలుసుకుంటూ పరిష్కారం చేసే పనిలో నిమగ్నమయ్యారు. మధిర నియోజకవర్గమే కాకుండా జిల్లా వ్యాప్తంగా ప్రత్యేకంగా ఒక క్యాడర్​ను సంపాదించుకున్నారు.

రేణుకాచౌదరిని ఖమ్మం ప్రజలు ఆడబిడ్డగా ఆశీర్వదించారు. మరి ఖమ్మం జిల్లా కోడలుగా మల్లు నందిని విక్రమార్కకు పార్లమెంటు అభ్యర్థిగా గెలుపించుకుంటామని రాజకీయాలకు అతీతంగా ప్రజల మద్దతు పలుకుతున్నారు. మల్లు నందినికి టిక్కెట్​ ఇవ్వాలని ఖమ్మం ఆడపడచులు రాహుల్​గాంధీని కోరారు.

ఖమ్మంలో రెండు బలమైన సామాజిక వర్గాల పోరులో తనకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. రాజకీయాలకు అతీతంగా మల్లు నందిని ప్రజలతో సంబంధాలు కొనసాగించడంతో ఆమె గెలుపుకు తిరుగులేదని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

 

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

Telangana Assembly: నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సెషన్స్.. దానిపైనే ప్రధాన చర్చ!

తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు(Telangana Assembly special sessions) నేటి (ఆగస్టు 30) నుంచి మూడు రోజుల పాటు జరగనున్నాయి. ఈ మేరకు ఉదయం 10:30 గంటలకు ప్రారంభం కానున్నాయి. తొలిరోజు ఉభయసభల్లో తొలుత ఇటీవల మరణించిన MLAలు, మాజీ సభ్యులకు…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *