మాలీవుడ్ లో హేమ కమిటీ రిపోర్టు రచ్చ.. ఆరోపణలు ఎదుర్కొంటున్నవారు రాజీనామా చేయాలన్న హీరో పృథ్వీరాజ్‌

ManaEnadu:మలయాళ చిత్ర పరిశ్రమలో మహిళల స్థితిగతులపై జస్టిస్ హేమా కమిటీ ఇచ్చిన రిపోర్టు ఇప్పుడు ఆ ఇండస్ట్రీలో సంచలనం రేకెత్తిస్తోంది. ఈ రిపోర్టులోని వివరాలు బయటకు వచ్చిన తర్వాత బాధితులు ఒక్కొక్కరుగా బయటకు వస్తూ తమకు ఎదురైన అనుభవనాలను వెల్లడిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ రిపోర్టుపై, రిపోర్టు తర్వాత జరుగుతున్న పరిణామాలపై తాజాగా మలయాళీ నటుడు పృథ్వీ రాజ్ సుకుమారన్ స్పందించాడు.

కొచ్చిలో ఫుట్‌బాల్ క్లబ్ ‘ఫోర్కా కొచ్చి’ (ఎఫ్‌సి) ప్రారంభోత్సవంలో పాల్గొన్న పృథ్వీ రాజ్ సుకుమారన్.. విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన ఇండస్ట్రీలో జరుగుతున్న పరిణామాలపై స్పందించారు. అధికారంలో ఉండి ఆరోపణలు ఎదర్కొంటున్న వారు వెంటనే పదవుల నుంచి తప్పుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. లైంగిక వేధింపులకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని అన్నారు. నిందితులు దోషులని తేలితే కఠిన చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.

“హేమ కమిటీలో వెల్లడించిన అంశాలు నాకు ఆశ్చర్యం కలిగించలేదు. ఎందుకంటే పరిశ్రమలో మహిళలకు సురక్షిత పని వాతావరణం కల్పించడం మన కనీస బాధ్యత. అందులో నేను ముందుంటా. కానీ అది నా ఒక్కడి బాధ్యత మాత్రమే కాదు. పరిశ్రమ మొత్తం ఆ పద్ధతిని అనుసరించాలి. అంతేకాదు జూనియర్‌ ఆర్టిస్టుల ఎంపికను క్రమబద్ధీకరించాలి’’ అని పృథ్వీరాజ్ తెలిపారు.

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *