‘అప్పటి వరకు అలా చేయొద్దు’.. నిర్మాతలకు మహేశ్ బాబు రిక్వెస్ట్

ManaEnadu:టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్‌బాబు (Mahesh Babu) ప్రధాన పాత్రలో దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి (SS Rajamouli) తెరకెక్కిస్తున్న మూవీ‘#SSMB29. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించి ప్రీ ప్రొడక్షన్‌ పనులు జరుగుతున్నాయి. ఈ సినిమా ప్రకటించినప్పటి నుంచి అప్డేట్స్ కోసం ఎంతో ఆశగా చూస్తున్న బాబు ఫ్యాన్స్‌కు నిరాశే మిగిలింది.

ప్రతి పండుగకు, పుట్టినరోజుకు అప్డేట్స్ వస్తాయని ఆశగా ఎదురు చూస్తున్న అభిమానులకు నిరాశే మిగులుతోంది. అయితే తాజాగా మహేశ్ బాబుకు సంబంధించి ఓ వార్త నెట్టింట బాగా వైరల్ అవుతోంది. నిర్మాతల హీరోగా చెప్పుకునే ఈ సూపర్ స్టార్ తాజాగా తను నటించిన సినిమా నిర్మాతలకు ఓ అల్టిమేటమ్ జారీ చేశాడట. ఇంతకీ అదేంటంటే?

ఇప్పటి వరకు కేవలం తెలుగు ప్రేక్షకులను అలరించిన మహేశ్ బాబు రాజమౌళి ప్రాజెక్ట్‌తో పాన్‌ వరల్డ్‌ ఆడియెన్స్‌ను ఆకట్టుకునేందుకు రెడీ అవుతున్నాడు. బాలీవుడ్‌లోనూ మొదటిసారిగా అడుగు పెట్టబోతున్నాడు. ఈ చిత్రంతోనే హిందీ ప్రేక్షకులకు పరిచయం కాబోతున్నాడు. అయితే ‘#SSMB29తోనే తన నటన హిందీ ప్రేక్షకులకు చేరువ కావాలని మహేశ్ బలంగా అనుకుంటున్నాడట.

అందుకే ఈ చిత్రం’ విడుదలయ్యే వరకు తన గత చిత్రాలను హిందీ (Mahesh Babu Hindi Movies)లోకి డబ్‌ చేసి థియేటర్‌లలో రిలీజ్‌ చేయొద్దని నిర్మాతలను కోరినట్లు సమాచారం. ఇప్పటి వరకు మహేశ్‌ నేరుగా ఏ హిందీ సినిమాలోనూ నటించలేదన్న విషయం తెలిసిందే. SSMB29 మూవీయే బాలీవుడ్‌లో తన ఫస్ట్ ఫిల్మ్ కాబోతోంది. అందుకే అక్కడి ప్రేక్షకులను అలరించేందుకు బాబు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఫిల్మ్ వర్గాల్లో టాక్.

ఇక అమెజాన్‌ అడవుల నేపథ్యంలో సాగే ఈ కథలో పలువురు విదేశీ నటులు కనిపించనున్నారని ఇప్పటికే వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే భారతీయ భాషలతో పాటు, విదేశీ భాషల్లోనూ ఈ సినిమాను అనువదించనున్నారు. దుర్గా ఆర్ట్స్‌పై కె.ఎల్‌.నారాయణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో మహేశ్ బాబు సరికొత్త లుక్‌లో కనిపించనున్నాడు. ఇప్పటికే పొడవాటి జుట్టుతో ఉన్న లుక్ బాగా వైరల్ అవుతున్న విషయం తెలిసిందే.

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *