‘మత్తు వదలరా2’కు వెళ్తున్నారా?.. ఐతే పార్ట్-1 రీక్యాప్ చూసేయండి

ManaEnadu:ఆస్కార్ విన్నర్, మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి తనయుడు శ్రీసింహా కోడూరి ప్రధాన పాత్రలో నటించిన సినిమా మత్తు వదలరా 2’ (Mathu Vadalara 2). మరో కీలక పాత్రలో సత్య నటించిన ఈ చిత్రాన్ని రితేశ్‌ రానా తెరకెక్కించాడు. 2019లో వచ్చిన మత్తువదలరా చిత్రానికి సీక్వెల్‌గా ఈ మూవీ రూపొందింది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ మూవీ సెప్టెంబరు 13న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇప్పటికే చిత్రబృందం మూవీ ప్రమోషన్స్‌ (Promotions) ముమ్మరం చేసింది. వెరైటీగా ప్రమోట్ చేస్తూ ప్రేక్షకులను అలరించేందుకు ప్రయత్నిస్తోంది. ఇటీవలే మత్తు వదలరా 2 టీమ్​ ప్రచారం కోసం దర్శకుధీరుడు రాజమౌళిని కలిసిన టీమ్ ఇప్పుడు మరో విధంగా ప్రమోట్ చేసింది. మత్తువదలరా చిత్రానికి ఈ మూవీ సీక్వెల్‌గా వస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పార్ట్-1కు సంబంధించి కథను మరోసారి ప్రేక్షకులకు చెప్పారు హీరో శ్రీసింహా (Sri Simha), నటుడు సత్య.
అయితే సాధారణంగా సినిమా కథను చెప్పకుండా టీవీల్లో ప్రసారమయ్యే క్రైమ్ స్టోరీ (Crime Atory) తరహాలో పార్ట్-1 కథను చెప్పారు. కథ చెప్పేటప్పుడు మధ్యమధ్యలో హ్యూమర్ యాడ్ చేశారు. ఇక చివరలో ఇంకా మొత్తం కథ చెప్పడం మా వల్ల కాదండోయ్, అమెజాన్ ప్రైమ్‌ (Amazon Prime)లో మత్తువదలరా పార్ట్-1 స్ట్రీమింగ్ అవుతోంది చూడండి అంటూ గుడ్ బై చెప్పారు. అలాగే సెప్టెంబరు 13వ తేదీన తప్పకుండా థియేటర్‌లకు వచ్చి తమ సినిమాను చూడాలని కోరారు.

ఇప్పుడు ఈ వీడియో (Mathu Vadalara Part 1 Recap) నెట్టింట బాగా వైరల్ అవుతోంది. ప్రమోషన్స్‌ చాలా క్రేజీగా ఉన్నాయంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. 3 గంటల సినిమాను 3 నిమిషాల్లో భలే చెప్పారు భయ్యా అంటూ నెటిజన్లు తెగ ప్రశంసలు కురిపించేస్తున్నారు. ఇక ‘మత్తు వదలరా 2’ సినిమా విషయానికి వస్తే ఈ చిత్రంలో ఫరియా అబ్దుల్లా, వెన్నెల కిశోర్, రోహిణి, సునీల్​ కీలక పాత్రలో నటిస్తున్నారు.

 

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *