Paris Olympics: లవర్స్‌గా బ్రేకప్.. దేశం కోసం మెడల్

Mana Enadu:ఒలింపిక్స్.. ప్రతి క్రీడాకారుడి కల. ఈ ఈవెంట్‌లో దేశం తరఫున ఆడాలి.. పతకం నెగ్గాలని ప్రతి ఆటగాడూ కోరుకుంటాడు. ప్రతి నాలుగేళ్లకు వచ్చే ఈ గేమ్స్ కొందరికి మధుర జ్ఞాపకాలను మిగిల్చితే.. మరికొందరికి చేదు అనుభవాలను పంచుతుంది. అందుకే ప్రపంచంలోని ఏ దేశ క్రీడాకారుడు అయినా సరే ఒక్కసారి అయినా తాను పాల్గొనే క్రీడాంశంలో దేశం తరఫున ఒలింపిక్స్ క్రీడల్లో పాల్గొనాలని భావిస్తుంటాడు. తాజాగా ఇలాంటి ఓ సంఘటన అందరినీ ఆకట్టుకుంటోంది.

ఒలింపిక్స్ పుణ్యమా అని..

పారిస్‌లో జరుగుతున్న ఒలింపిక్స్ టెన్నిస్ క్రీడాంశంలో మిక్స్‌డ్ డబుల్స్‌లో స్వర్ణ పతకాన్ని చెక్ రిపబ్లిక్‌కు చెందిన కాటెరినా సినియాకోవా, టోమాస్ మచాక్ జోడీ గెలుచుకుంది. అయితే, వీళ్ల విజయం పట్ల సోషల్ మీడియాలో సందడి మామూలుగా లేదు. ఇందులో ప్రేమ కోణం ఉండడమే అసలు విషయం. సినియాకోవా, టోమాస్ మచాక్ గతంలో ప్రేమికులు. టెన్నిస్ ఆట ఇద్దరినీ కలిపింది. ఒకే దేశం కావడంతో త్వరలోనే పెళ్లి చేసుకుంటారని అందరూ భావించగా, అభిమానులకు నిరాశ కలిగిస్తూ… ఇద్దరూ విడిపోయారు. వారి మధ్య రిలేషన్ షిప్ కు అంతటితో తెరపడింది. కానీ, పారిస్ ఒలింపిక్స్ పుణ్యమా అని ఇద్దరూ మళ్లీ జట్టు కట్టారు. అయితే ప్రేమ కోసం కాదు… దేశం కోసం. వ్యక్తిగత జీవితంలోని విభేదాలన్నీ పక్కనబెట్టి కష్టపడి ఆడి తమ దేశానికి స్వర్ణం అందించారు.

 ఇది చాలా పెద్ద రహస్యం

మీడియా సమావేశంలో కొందరు రిపోర్టర్లు సినియకోవా-టోమాస్ మచాక్ లను వారి లవ్ లైఫ్ గురించి ప్రశ్నించారు. మీ మధ్య ప్రేమ బంధం తెగిపోయిందన్నారు. కానీ ఇద్దరూ ఎంతో సమన్వయంతో ఆడి గోల్డ్ మెడల్ గెలిచారు. ఎలా సాధ్యం? అని ప్రశ్నించారు. అందుకు సినియకోవా స్పందిస్తూ..”మా వ్యక్తిగత జీవితం గురించి మీరు తెలుసుకోవాల్సిన అవసరంలేదు. అయినా మీరు ఇలా అయోమయానికి గురికావడం చూస్తుంటే భలేగా ఉంది” అని వ్యాఖ్యానించింది. టోమాస్ మచాక్ స్పందిస్తూ “ఇది చాలా పెద్ద రహస్యం” అంటూ నవ్వేశాడు.

 

Related Posts

BWF World Championships: సెమీస్‌లో చిరాగ్-సాత్విక్ జోడీ.. సింధుకు తప్పని ఓటమి

పారిస్‌లో జరుగుతున్న బీడబ్ల్యూఎఫ్ ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ (BWF World Championships-2025)లో భారత్‌కు మిశ్రమ ఫలితాలు దక్కాయి. పురుషుల డబుల్స్‌లో సాత్విక్‌ సాయిరాజ్ రంకిరెడ్డి(Satwiksairaj Rankireddy), చిరాగ్ శెట్టి(Chirag Shetty) జోడీ అద్భుత ప్రదర్శనతో సెమీఫైనల్‌(Semifinals)కు చేరి పతకాన్ని ఖాయం చేసుకుంది.…

PKL- 2025: సాగర తీరంలో కబడ్డీ కూత.. నేటి నుంచి పీకేఎల్ సీజన్ 12 షురూ

క‌బ‌డ్డీ అభిమానులు ఎంత‌గానో ఎదురుచూస్తున్న Pro Kabaddi League-2025 వ‌చ్చేసింది. ఇప్ప‌టికే విజ‌యవంతంగా 11 సీజ‌న్లు పూర్తి చేసుకుంది. నేటి (ఆగ‌స్టు 29) నుంచి 12వ సీజ‌న్ (PKL 12) ప్రారంభం కానుంది. ఈ సారి మొత్తం 12 జ‌ట్లు టైటిల్…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *