TG:సీఎం రేవంత్ దిల్లీ టూర్‌.. కేబినెట్ విస్తరణపై హైకమాండ్​తో చర్చలు

ManaEnadu:ముఖ్యంత్రి రేవంత్ రెడ్డి ఈమధ్య తరచూ దిల్లీ పర్యటనలు సాగిస్తున్నారు. రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు, నామినేటెడ్ పదవులపై హైకమాండ్​తో చర్చించేందుకు ఆయన హస్తినకు వెళ్తున్నారు. ఇటీవలే ఆయన దేశ రాజధానిలో పర్యటించి కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే, అగ్రనేత రాహుల్ గాంధీలను కలిశారు. కేబినెట్ విస్తరణ, నామినేటెడ్ పదవులపై చర్చించారు. కానీ ఆ చర్చలు ఓ కొలిక్కి రాలేదు.

ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇవాళ (గురువారం) రాత్రి 11 గంటలకు మరోసారి దిల్లీ వెళ్లనున్నారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్‌బాబు, ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి, కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర ఇన్ఛార్జి దీపాదాస్‌ మున్షీ కూడా సీఎం వెంట వెళ్లనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఇవాళ దిల్లీ చేరుకోనున్న ఆయన శుక్రవారం రోజున పార్టీ పెద్దలతో సమావేశం కానున్నారు.

ఈ సందర్భంగా పీసీసీ అధ్యక్షుడి ఎంపిక, మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్‌ పదవుల భర్తీ అంశాలపై హైకమాండ్​తో రేవంత్ రెడ్డి చర్చలు జరపనున్నట్లు తెలిసింది. మరోవైపు తెలంగాణ నుంచి రాజ్యసభ సభ్యుడిగా అభిషేక్‌ మను సింఘ్వీ ఏకగ్రీవ ఎంపిక అంశాలపై చర్చించనున్నారు. అదే విధంగా సచివాలయంలో ఏర్పాటు చేస్తున్న దివంగత మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ విగ్రహావిష్కరణకు సోనియా గాంధీ, రాహుల్‌, ప్రియాంకలను ఆహ్వానిస్తారు.

ఇంకోవైపు రూ.2లక్షల రుణమాఫీ చేసిన సందర్భంగా వరంగల్‌లో నిర్వహించనున్న కృతజ్ఞత సభకు రాహుల్‌ గాంధీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆహ్వానించనున్నారు. రాష్ట్రంలో గడిచిన ఎనిమిది నెలల కాంగ్రెస్‌ ప్రభుత్వంలో అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు, ఆరు గ్యారంటీల అమలు అంశాలపై కూడా చర్చించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు వెల్లడించాయి.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *