మూడు రంగులు జెండాది అధికారం..రాహులే ప్రధాని ..మంత్రి తుమ్మల

మన Enadu: రానున్న పార్లమెంటు ఎన్నికల్లోనూ దేశంలో మూడు రంగుల జెండాదే అధికారం రాబోతుందని వ్వవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. రాహులే ప్రధానిగా దేశాభివృద్ధిలో కీలకమైన అడుగులు వేయబోతున్నారని ధీమా వ్యక్తం చేశారు. ఉప్పల్​లో జరిగిన మల్కాజిగిరి పార్లమెంటు కాంగ్రెస్​ కార్యకర్తల సమావేశంలో ఆయన బీఆర్​ఎస్​ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

కాంగ్రెస్​, భారతీయ జనతాపార్టీల మధ్యనే పోటీ ఉండబోతుందన్నారు. తెలంగాణలోని 17పార్లమెంటు స్థానాల్లో మొత్తం కాంగ్రెస్​ అభ్యర్థులు విజయం సాధించబోతున్నారని పేర్కొన్నారు. ప్రగల్భాలు పలుకుతున్న బీఆర్​ఎస్​ దుకాణం బంద్​ చేసే పరిస్థితి వచ్చిందని విమర్శలు  చేశారు. గత సర్కారు బీఆర్​ఎస్​ చేసిన మోసాలను సోషల్​ మీడియా వేదికగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని కార్యకర్తలకు సూచించారు.

మూడు నెలల సమయంలో ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీలకు నాలుగు గ్యారంటీలు అమలు చేసి ప్రజాప్రభుత్వంగా తిరుగులేని విజయాన్ని రేవంత్​ సర్కారు సొంతం చేసుకకుందని తెలిపారు. ఇప్పటికే కాంగ్రెస్​ ప్రభుత్వం రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రజల్లోకి చేరవయ్యేలా చూడాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈకార్యక్రమంలో ఉప్పల్ కాంగ్రెస్​ ఇంచార్జీ మందముల పరమేశ్వరరెడ్డి, జనంపల్లి వెంకటేశ్వరరెడ్డి, గరిక సుధాకర్​ పాల్గొన్నారు.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

Telangana Assembly: నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సెషన్స్.. దానిపైనే ప్రధాన చర్చ!

తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు(Telangana Assembly special sessions) నేటి (ఆగస్టు 30) నుంచి మూడు రోజుల పాటు జరగనున్నాయి. ఈ మేరకు ఉదయం 10:30 గంటలకు ప్రారంభం కానున్నాయి. తొలిరోజు ఉభయసభల్లో తొలుత ఇటీవల మరణించిన MLAలు, మాజీ సభ్యులకు…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *