మూడు రంగులు జెండాది అధికారం..రాహులే ప్రధాని ..మంత్రి తుమ్మల

మన Enadu: రానున్న పార్లమెంటు ఎన్నికల్లోనూ దేశంలో మూడు రంగుల జెండాదే అధికారం రాబోతుందని వ్వవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. రాహులే ప్రధానిగా దేశాభివృద్ధిలో కీలకమైన అడుగులు వేయబోతున్నారని ధీమా వ్యక్తం చేశారు. ఉప్పల్​లో జరిగిన మల్కాజిగిరి పార్లమెంటు కాంగ్రెస్​ కార్యకర్తల సమావేశంలో ఆయన బీఆర్​ఎస్​ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

కాంగ్రెస్​, భారతీయ జనతాపార్టీల మధ్యనే పోటీ ఉండబోతుందన్నారు. తెలంగాణలోని 17పార్లమెంటు స్థానాల్లో మొత్తం కాంగ్రెస్​ అభ్యర్థులు విజయం సాధించబోతున్నారని పేర్కొన్నారు. ప్రగల్భాలు పలుకుతున్న బీఆర్​ఎస్​ దుకాణం బంద్​ చేసే పరిస్థితి వచ్చిందని విమర్శలు  చేశారు. గత సర్కారు బీఆర్​ఎస్​ చేసిన మోసాలను సోషల్​ మీడియా వేదికగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని కార్యకర్తలకు సూచించారు.

మూడు నెలల సమయంలో ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీలకు నాలుగు గ్యారంటీలు అమలు చేసి ప్రజాప్రభుత్వంగా తిరుగులేని విజయాన్ని రేవంత్​ సర్కారు సొంతం చేసుకకుందని తెలిపారు. ఇప్పటికే కాంగ్రెస్​ ప్రభుత్వం రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రజల్లోకి చేరవయ్యేలా చూడాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈకార్యక్రమంలో ఉప్పల్ కాంగ్రెస్​ ఇంచార్జీ మందముల పరమేశ్వరరెడ్డి, జనంపల్లి వెంకటేశ్వరరెడ్డి, గరిక సుధాకర్​ పాల్గొన్నారు.

Related Posts

Vijayasai Reddy : ‘లిక్కర్ స్కామ్ కేసులో వాళ్ల భరతం పట్టండి.. నేను సహకరిస్తా’

ఆంధ్రప్రదేశ్‌లో లిక్క్‌ స్కామ్‌ కేసు (AP Liquor Scam Case)లో రోజుకో కీలక మలుపు చోటుచేసుకుంటుంది. సంచలనం రేపిన ఈ కేసులో ఇప్పటికే మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి సిట్ విచారణ (SIT Inquiry) ఎదుర్కొని కీలక సమాచారాన్ని అధికారులు అందించారు.…

HCU వివాదం.. మాజీ సీఎం కేసీఆర్ కీలక ప్రకటన

ప్రస్తుతం తెలంగాణలో తీవ్ర చర్చనీయాంశమవుతున్న అంశం HCU భూముల వివాదం. రంగారెడ్డి జిల్లా శేర్లింగంపల్లిలోని కంచ గచ్చిబౌలి 400 ఎకరాల (Kancha Gachibowli Land Issue) విషయం ఇప్పుడు రాష్ట్రంలో తీవ్ర దుమారం రేపుతోంది. ఈ విషయంపై తాజాగా ముఖ్యమంత్రి రేవంత్…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *