ManaEnadu: నందమూరి బాలకృష్ణ స్వర్ణోత్సవ వేడుకలను పురస్కరించుకుని తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ AP సీఎం చంద్రబాబు ఆహ్వనం అందించారు. తెలుగు సినీ పరిశ్రమ ఆధ్వర్యంలో హైటెక్స్లో నిర్వహించే సెలబ్రేషన్స్కు హజరుకావాలని కోరారు.
నందమూరి బాలకృష్ణ సినీ రంగ ప్రవేశం చేసి 50 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా సెప్టెంబర్ 1న హైదరాబాద్ హైటెక్స్ నోవోటెల్ హోటల్లో తెలుగు సినీ పరిశ్రమ ఆధ్వర్యంలో గ్రాండ్ గా సెలబ్రేషన్స్ ని ప్లాన్ చేసినట్లు వివరించారు.. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని సినీ ఇండస్ట్రీ తరఫున ఆహ్వానించిన తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ సెక్రటరీ టి. ప్రసన్నకుమార్, తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ భరత్ భూషణ్ , నిర్మాత కె. ఎల్. నారాయణ , నిర్మాత జెమినీ కిరణ్ , నిర్మాత మరియు డిస్ట్రిబ్యూటర్ కొమ్మినేని వెంకటేశ్వరరావు , అలంకార్ ప్రసాద్ , రాజా యాదవ్ తెలిపారు