‘భవిత రహిత సమితి (బీఆర్ఎస్) నేత కేటీఆర్ రేవంత్ రెడ్డి గారిని సీఎంగా ప్రకటించినట్లయితే గత అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్కు 30 స్థానాలు వచ్చేవి కాదు అన్నారు. కానీ, ఆ ఎన్నికలల్ల కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ గారిని సీఎంగా ప్రకటించి 64 స్థానాలు గెలవలే.. ఐతే కేసీఆర్ గారు సీఎం అని ప్రకటించుకున్న బీఆర్ఎస్ 39 స్థానాల్లో మాత్రమే తెచ్చుకున్నది.
సీఎంగా రేవంత్ రెడ్డిని ముందే ప్రకటిస్తే 30 సీట్లు కూడా కాంగ్రెస్కు వచ్చేవి కాదని కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ నాయకురాలు విజయశాంతి ట్విట్టర్ వేదికగా కౌంటర్ ఇచ్చారు.
ఇక బీజేపీ అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు బీఆర్ఎస్పై వ్యతిరేకతతో మాత్రమే కాంగ్రెస్ను ప్రజలు గెలిపించారు అంటున్నారు. అవును బీఆర్ఎస్పై వ్యతిరేకతతోనే కాంగ్రెస్ను గెలిపించారు. కాక బీఆర్ఎస్పై అనుకూలతతో కాంగ్రెస్ను గెలిపిస్తారా.. ఆ ప్రకటన ప్రజలకు అర్థం కావట్లేదు’ అని ట్వీట్ చేశారు.