SLBC టన్నెల్‌‌లో భయంకర పరిస్థితి.. కార్మికుల ఆచూకీ ప్రశ్నార్థకం!

ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌(SLBC Tunnel) కూలిన ఘటనలో గల్లంతైన కార్మికుల కోసం రెస్క్యూ ఆపరేషన్(Rescue operation) కొనసాగుతోంది. గత నెల 22న నాగర్ కర్నూల్‌ జిల్లాలోని శ్రీశైలం ఎడమగట్టు కాలువ కూలిపోయింది. ఈ ఘటనలో 8 మంది కార్మికులు(Workers) టన్నెల్ లోపలే చిక్కుకుపోయారు. అయితే గత పది రోజులుగా సహాయక చర్యలు చేపడుతున్నా కార్మికుల ఆచూకీ ఇంతవరకూ తెలియలేదు. దీంతో వారి గుర్తింపు ప్రశ్నార్థకంగా మారింది. మరోవైపు టన్నెల్ లోపల ప్రమాదకర పరిస్థితులు ఉన్నాయని రెస్క్యూ సిబ్బంది చెబుతున్నారు.

SLBC Tunnel Fall: Help SLBC Tunnel Accident, Relief-Army, Navy -  EliteAnswers.in

ఇదిలా ఉండగా సొరంగం కూలిన ప్రాంతంలోనే కాకుండా అక్కడి నుంచి దాదాపు 400 మీటర్ల దూరం వరకూ సిమెంట్‌ సెగ్మెంట్లు(Cement segments) చెదిరిపోయిందని, వాటి మధ్య నుంచి నీటిఊట నిరంతరంగా వస్తోందని కార్మికులు, సహాయ బృందాలు తెలిపాయి. దీంతో ఆయా ప్రాంతాల్లో సైతం టెన్నెల్ కూలే ప్రమాదముందని అంటున్నారు. దీంతో ఏ క్షణం ఏం జరుగుతుందోనని ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని సహాయ బృందాలు లోపలికి వెళ్తున్నాయి.

శిథిలాలను తీస్తే ఏం జరుగుతుందో..

శ్రీశైలం నుంచి ఇన్‌లెట్‌ సొరంగంలో 13.93కిలోమీటరు వద్ద గట్టి రాతి పొరల చీరకలు వచ్చి భారీ ఎత్తున ఊట వస్తోందని, దీంతో మట్టి పేరుకుపోతుందని అంటున్నారు. దీంతో నిపుణులు, సహాయ బృందాలు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఈ నేపథ్యంలో సహాయ చర్యలు చేపట్టేందుకు రెస్క్యూ బృందాలు, కార్మికులు లోపలికి అడుగుపెట్టేందుకు జంకుతున్నారు. శిథిలాలను తీస్తే ఏది, ఎక్కడ, ఎప్పుడు కూలుతుందో తెలియని ఆందోళనకర పరిస్థితి నెలకొంది. దీంతో సహాయ చర్యలు చేపట్టేందుకు కార్మికులు, రెస్య్యూ బృందాలు తటపటాయిస్తున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలోనే రోబో(Robo)ల సేవలను వినియోగించుకోవాలని ఉన్నతాధికారులు, రెస్య్యూ బృందాలు సీఎం రేవంత్(CM Revanth Reddy) సూచించినట్లు సమాచారం.

SLBC tunnel collapse: SLBC tunnel collapse: Telangana CM says no  conclusion..

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *