ManaEnadu:చెరువులు లేనప్పుడు ఇటీవల వచ్చిన వరదలతో విజయవాడ సీటీ వరదలో మునిగిపోయిన పరిస్థితి హైదరాబాదులోనూ ఏర్పడతుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. సదరన్ కాలిఫోర్నియా తెలుగు కమ్యూనిటీ, స్థానిక కాన్సుల్ జనరల్ సంయుక్తంగా ఏర్పాటు చేసిన మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. నది గర్భంలో ఇల్ల నిర్మాణాలు చేస్తున్నారు. వీటిని ఇప్పటికీ ఆపకపోతే భవిష్యత్తు తరాలకు పెద్ద ప్రమాదం వాటిల్లుతుంది.
శాన్ ఫ్రాన్సిస్కో లో సదరన్ కాలిఫోర్నియా తెలుగు కమ్యూనిటీ, స్థానిక కాన్సుల్ జనరల్ సంయుక్తంగా ఏర్పాటు చేసిన మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించడం జరిగింది
హైదరాబాద్ అంటేనే రాక్స్, లేక్స్, పార్క్స్ ఇళ్ల నిర్మాణం పేరిట రాళ్లు కనుమరుగైపోయాయి లేక్స్ కబ్జా చేసి ఇల్లు… pic.twitter.com/Nx3KwvkY68
— Bhatti Vikramarka Mallu (@Bhatti_Mallu) September 29, 2024
హైదరాబాద్ కి ప్రాణాంతకంగా మారుతుంది. పేదవాళ్లను అడ్డంపెట్టి బిల్డర్స్ నిర్మాణాలు చేపట్టి వ్యాపారం చేస్తున్నారు. ధన, మానప్రాణాలు కాపాడడం ప్రభుత్వ బాధ్యతగా చూడాలన్నారు. చెరువులను రక్షించేందుకు భవిష్యత్తు తరాలను అందించేందుకు తెలంగాణ రాష్ట్రంలో చర్యలు చేపట్టడం జరిగిందన్నారు.
మూసీ నది పరివాహక ప్రాంతంలో కుటుంబాలు ఆరోగ్యంగా జీవించేందుకు ఆ నదిని తీర్చిదిద్దాలనేది ప్రభుత్వం ఆలోచన. కలుషితమైన మూసీ నదిలో జీవించడం ఎవరికి కూడా మంచిది కాదు అన్నారు. హైదరాబాద్ అంటేనే.. లెక్స్..రాక్స్.. పార్క్స్ అన్నారు. లెక్స్స్ లో ఇప్పుడు ఇండ్లు కట్టుకుంటున్నారని తెలిపారు. పేదలను ముందు పెట్టీ బిల్డర్స్ ఇష్యూ చేస్తున్నారని తెలిపారు. ఇప్పటి వరకు ఎఫ్ టీ ఎల్ లో ఇండ్లు కట్టుకున్నవే కూల్చేస్తున్నామన్నారు. ఇంకా బఫర్ జోన్ పై నిర్ణయం తీసుకోలేదన్నారు. మూసి లో కూడా ఇండ్లు కట్టుకున్నారని, అది వారికి..వారి ఆరోగ్యానికి కూడా మంచిది కాదన్నారు. మూసి లో ఇండ్లు కట్టుకున్న వాళ్ల కి బయట డబుల్ బెడ్ రూం ఇస్తున్నామని క్లారిటీ ఇచ్చారు. చెరువుల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిదన్నారు.