Santhana Prapthirasthu : ‘వేమన తెల్సుగా మా కులపోడే’

టాలీవుడ్ డైరెక్టర్, యాక్టర్, నేషనల్ అవార్డు విన్నర్ తరుణ్ భాస్కర్ (Tharun Bhascker) ఓవైపు దర్శకత్వంతో మరోవైపు నటుడిగా బిజీగా గడుపుతున్నాడు. ఆయన కీలక పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ సినిమా  ‘సంతాన ప్రాప్తిరస్తు (Santhana Prapthirasthu)’. విక్రాంత్, చాందిని చౌదరి (Chandini Chowdary) ప్రధాన పాత్రల్లో మ్యూజికల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా నుంచి తాజాగా తరుణ్ భాస్కర్ పాత్రకు సంబంధించిన పోస్టర్ విడుదలైంది. ఈ చిత్రంలో ఆయన జాక్ రెడ్డి అనే పాత్రలో కనిపించనున్నారు.

జాక్ రెడ్డిగా తరుణ్ భాస్కర్

ఈ సందర్భంగా మేకర్స్ తరుణ్ పాత్రకు సంబంధించిన పోస్టర్ విడుదల చేశారు. ఈ పోస్టర్ లో తరుణ్ చాలా సీరియస్ లుక్ లో కనిపిస్తున్నాడు. ఆయన చుట్టూ అంత్యక్రియలకు సంబంధించిన సింబల్స్ ఉన్నాయి. ఇక కింద ‘జాక్ రెడ్డి ఫ్యునరల్ సర్వీస్ (Jack Reddy Funeral Service)’ అని కనిపించిన ఓ వ్యాన్ ఈ మూవీలో తరుణ్ భాస్కర్ పాత్రపై క్యూరియాసిటీ పెంచుతోంది. ముఖ్యంగా జాక్ రెడ్డి పాత్రను పరిచయం చేస్తూ వేమన తెల్సుగా మా క్యాస్టే అంటూ ఇచ్చిన క్యాప్షన్ ఆసక్తికరంగా ఉంది.

వేమన మన క్యాస్టే

ఇక ఈ సినిమాను మధుర శ్రీధర్ రెడ్డి, నిర్వి హరిప్రసాద్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో వెన్నెల కిషోర్ (Vennela Kishore), అభినవ్ గోమటం, జీవన్ కుమార్, మురళిధర్ గౌడ్, శ్రీలక్ష్మి, హర్ష వర్ధన్, బిందు చంద్రమౌళి, సత్య కృష్ణ, తాగుబోతు రమేష్, అభయ్ బేతిగంటి, కిరీటి, అనిల్ గీలా, సద్దాం కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఇప్పటికే మేకర్స్ ఈ మూవీ నుంచి వెన్నెల కిషోర్, అభినవ్ గోమటం, జీవన్ కుమార్ క్యారెక్టర్ పోస్టర్లు విడుదల చేశారు. కామెడీ, ఎమోషన్స్ మిక్స్ చేసిన ఈ స్టోరీలో దంపతులు ఎదుర్కొనే పలు సమస్యలను ఆసక్తికరంగా చూపించబోతున్నట్లు సమాచారం.

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *